ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బుర్రలోంచి పుట్టిన ఒక ఆలోచన ఏపీ పోలీసులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కేలా చేస్తోంది. అంతేకాదు - ఏపీ పోలీసు శాఖ విధానాలను ఇతర రాష్ట్రాలు అడాప్ట్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అంతేకాదు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఏపీ పోలీసు శాఖలో అమలవుతున్న విధానాలను తెలుసుకుని ప్రశంసించారు.


 గుజరాత్ లో పోలీసు శాఖకు చెందిన ఓ ఎగ్జిబిషన్ లో నెల కిందట  దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల పోలీసులు స్టాల్స్ పెట్టగా అందులో ఏపీ పోలీసుల స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాదు.. ప్రధాని మోదీ ప్రశంసంలూ దక్కించుకుంది. ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయమే తమకు ప్రశంసలు దక్కేలా చేసిందని పోలీసులు చెబుతున్నారు. గుజరాత్ లోని వడోదరలో పోలీస్ టెక్నికల్ ఆ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఆ ఎగ్జిబిషన్ ను ప్రధాని సందర్శించి దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలకు చెందిన పోలీస్ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను తిలకించారు. పోలీసు అధికారుల్ని అడిగి వివరాలు స్వయంగా తెలుసుకున్నారు.

 

ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఏపీ పోలీస్ స్టాల్ ను ప్రధాని మోదీ చూసి వివరాలు తెలుసుకున్నారు. ఏపీ పోలీసు శాఖలో స్పందన - వీక్లీ ఆఫ్ సిస్టమ్ పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. దీనిపై పూర్తిస్థాయి వివరాలు అందజేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పోలీసు అధికారుల్ని కోరారు.

 

ప్రధాని ప్రశంసలు కురిపించడపై ఏపీ పోలీసు అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం వినూత్నంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ ను అమలు చేస్తోంది. ప్రయోగాత్మకంగా ముందు కొన్ని జిల్లాల్లో ప్రవేశపెట్టగా విజయవంతం అయ్యింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ వీక్లీ ఆఫ్ ల పద్దతి అమలవుతోంది. ఇక ప్రజా సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం స్పందన పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి సోమవారం ప్రజల నుంచి వినతుల్ని స్వీకరిస్తోంది.. ఆ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది. స్పందన కార్యక్రమంలో భాగంగా పోలీసుశాఖ కూడా వారి పరిధిలోకి వచ్చే సమస్యల్ని పరిష్కరిస్తోంది. ఈ సంస్కరణలన్నీ జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన సూచన మేరకు అమలు చేశామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

 

ప్రస్తుతం ఈ స్పందన కార్యక్రమం పై సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారి హరికృష్ణ ఈ స్పందన కార్యక్రమంపై జిల్లాల్లో అధికారులు - ఉద్యోగులతో వర్క్ షాప్ లు నిర్వహిస్తున్నారు. స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నది ముఖ్యమంత్రి ఆదేశాలను.. స్పందనలో వచ్చే దరఖాస్తుల పరిష్కారానికి ప్రబుత్వం హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తోందని.. ముఖ్యమంత్రి కార్యాలయం దీన్ని పర్యవేక్షిస్తోందని ఆయన జిల్లాల్లోని అధికారులకు స్పష్టం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: