మనుషులకు పుట్టిన వారు చేయకూడని పని, నిజంగా తల్లి కడుపు నుండి వస్తే, ఒక్క అమ్మ ఆయ్యకు పుట్టి ఉంటే ఇంత నీచాతి నీచంగా, అడవిలో జంతువుల్లా ప్రవర్తించకూడదు. ఒక్కమ్మాయిని ఇంత రాక్షసంగా జంతువుల్లా మీదపడి అరుస్తున్నా బలవంతంగా మానభంగం చేసిన ఘటన చూస్తుంటే అసలు పుట్టినప్పుడు వీరు తల్లిపాలేనా తాగి పెరిగింది అని అంటున్నారు ఆ సంఘటనను ప్రత్యక్షంగా గమనిస్తున్న వారు.

 

 

ఇక ఇప్పుడు వెటర్నరీ డాక్టర్ హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇకపోతే ప్రియాంక హత్యాచారం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెపై గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన నిందితులను పట్టుకోవడంలో.. బాధితురాలి ఫోన్ కాల్ లిస్ట్ ఉపయోగపడిందని రిమాండ్ రిపోర్టును బట్టి తెలుస్తోంది. అదేమంటే టోల్‌ ప్లాజా సమీపంలో ప్రియాంక తన స్కూటీని నవంబర్ 28, సాయంత్రం 6 గంటలకు ఉంచి వెళ్లడాన్ని నిందితులు గమనించారు. ఆ టైంలో మద్యం సేవిస్తున్న వారంతా.. ఆమె అక్కడికే తిరిగి వస్తుందని భావించి, నిందితుల్లో ఒక చండాలపు వెధవ స్కూటీ వెనుక టైర్లో గాలి తీసేశాడు.

 

 

తనపని ముగించుకున్న ప్రియాంక రాత్రి 9.18 గంటలకు స్కూటీ ఉంచిన చోటుకి వచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న నిందితుడు మహ్మద్ ఆరీఫ్‌ బ్యాక్ టైర్ పంక్చర్ అయిందంటూ మాట కలిపి సాయం చేస్తానని నమ్మించాడు. అలా ఆమె ఫోన్‌ నంబర్ తీసుకుని, పంక్చర్ వేయించడం కోసం స్కూటీని తీసుకుని వెళ్లాడు. అతను వెళ్లి చాలా సేపు గడిచినా వారు రాకపోయే సరికి ఆరిఫ్ కు ఫోన్‌ చేసింది. ఇక్కడ నిందితులను పట్టుకోవడంలో కాల్ చేయడం అనేది కీలకంగా మారింది. దీన్ని బట్టి ఆమె హత్య కేసును 48 గంటల్లోనే చేధించారు పోలీసులు .

 

 

ఇకపోతే నలుగురు మగ కుక్కలు దాదాపు గంట సేపు బాధితురాలిపై అత్యాచారం చేశారు. హెల్ప్ హెల్ప్ అని ఆమె అరుస్తుంటే.. నోట్లో బలవంతంగా మద్యం పోశారు. అరవకుండా ముక్కు, నోటిని గట్టిగా మూయడంతో.. ఊపిరాడక ఆమె ప్రాణాలు కోల్పోయింది. తర్వాత ప్యాంట్ లేకుండానే ఆమె శవాన్ని లారీలోకి ఎక్కించారు.

 

 

ఆ తర్వాత కూడా మరోసారి రేప్ చేశారు. తర్వాత నిందితుల్లో ఒకరు ఆమె కాళ్లకు ప్యాంట్ తొడిగి షాద్‌నగర్‌ బ్రిడ్జి కింద శవాన్ని పడేశారు. ఆమె బతికి ఉంటుందేమోననే అనుమానంతోనే పెట్రోల్ బంక్ దగ్గరకెళ్లి.. పెట్రోల్ తెచ్చి శరీరంపై పోసి తగులబెట్టారు. పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో ఈ నిజాలు బయటపడ్డాయి. అందుకే అమ్మాయిలు అపరిచితుల్ని నమ్మకండి. అసలు మగ కుక్కలనే నమ్మకండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: