హైదరాబాద్ లో ప్రియాంకారెడ్డి హత్య కేసు ఓ వైపు సంచలనం సృష్టిస్తుండగానే మరికొన్ని దారుణాలు వెలుగు చూస్తున్నాయి. మొన్న సిద్ధుల గుట్ట ప్రదేశంలో ఓ మహిళ కాలిపోతూ కనిపించింది. తాజాగా నిజాంపేటలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని అత్యాచారానికి గురైంది. అదృష్టం ఏంటంటే.. రేప్ చేసిన కామాంధుడు ఆమెను ప్రాణాలతో వదిలేశాడు.

 

వివరాల్లోకి వెళ్తే.. సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని ఆమె స్నేహితుడే అత్యాచారం చేశాడు. నిజాంపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉండే 24 ఏళ్ల యువతి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. తన సోదరితో కలసి నిజాం పేట ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంటులో నివసిస్తోంది. శనివారం మధ్యాహ్నం ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని తన ఇంట్లో ఉండగా.. 28 ఏళ్ల జయల్‌ చంద్‌ అనే మిత్రుడు ఆమె ఇంటికి వచ్చాడు. స్నేహితుడే కదా అని లోనికి రానిచ్చింది.

 

కానీ అతడి కళ్ల వెనుక దాగిన కామాన్ని గుర్తించలేకపోయింది. కాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పిన జయల్ చంద్.. ఆమె ఇంట్లో ఒక్కతే ఉందన్న సంగతి తెలిసి.. అరాచకానికి ఒడి కట్టాడు. 24 ఏళ్ల యువతిపై తన పశుత్వాన్ని చూపించాడు.. బలాత్కారం చేసి అత్యాచారం చేశాడు. అపార్ట్ మెంట్ కావడంతో ఆమె అరుపులు పెద్దగా ఎవరికీ వినిపించలేదు.

 

జయంత్ చంద్ చేసిన దారుణంతో ఆ యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. చేసిందంతా చేసి ఆ యువకుడు తన దారిన తాను వెళ్లిపోయాడు. బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన సోదరి.. తన అక్కడ అలా అచేతనంగా పడి ఉండటంతో ఏదో ఘోరం జరిగిందని ఊహించింది. సోదరి అపస్మారక స్థితిలో పడి ఉండటంతో ఏం చేయాలో తోచక అర్జంట్ గా పోలీసులకు సమాచారం అందించింది. వారు హుటాహుటిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: