శంషాబాద్ లో డాక్టర్ ప్రియాంక కు జరిగిన దారుణమైన అన్యాయాన్ని మరువకముందే నగరంలో మరొక మహిళపై అత్యాచారం చోటు చేసుకుంది. ఈ సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేటలో జరగగా స్థానికంగా ఇప్పుడు అక్కడి పరిస్థితి కలకలం గా మారింది. వివరాల్లోకి వెళితే నిజాంపేటలోని ఈశ్వర్ విల్లాస్ రోడ్డులో ఒక అపార్ట్మెంట్ లో ఒక అక్క మరియు చెల్లెలు నివాసం ఉంటున్నారు. అక్క స్థానికంగా టీచర్ గా విధులు నిర్వహిస్తుండగా బాధితురాలైన చెల్లి ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తోంది. 

 

మనం బ్రతుకుతుంది మానవ మృగాల మధ్య అని తెలియక వీరిద్దరూ ఎటువంటి మగ తోడు లేకుండా ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటుండగా ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అక్క వివాహ విషయమై ఒక మ్యారేజ్ బ్యూరో కు చెందిన జయల్‌చంద్‌ అనే వ్యక్తితో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరాగా తీసుకున్న నిందితుడు శనివారం సాయంత్రం యువతి ఇంటికి వచ్చి ఒంటరిగా ఉన్న ఆమె చెల్లెలు పై ఇంత దారుణానికి ఒడిగట్టాడు. తన విధులు ముగించుకొని రాత్రి ఇంటికి వచ్చి చెల్లెలి కోసం చూసిన అక్క షాక్ కు గురయింది.

 


అపస్మారక స్థితిలో అవిచ్చన్నంగా పడి ఉన్న తన చెల్లి దేహాన్ని వెంటనే చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించింది. ఈ సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరగగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోసం గాలింపు చేస్తున్నారు. ప్రియాంక ఘటన జరిగి సరిగ్గా 72 గంటలు గడవకముందే మరొక ఘోరం జరగడంతో పోలీసులు ఈ సంఘటనపై స్పందించేందుకు నిరాకరించారు. అయితే ఉన్న సమాచారం ప్రకారం ఆమె గాంధీ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నట్లు తెలిసింది. ఇక ఇటువంటి ఘటనలు ఆడవారిపై జరగకుండా ఉండాలంటే నిందితులకు అతి ఘోరమైన శిక్షలు విధించక తప్పదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: