శంషాబాద్ లో బుధవారం రాత్రి జరిగిన దారుణమైన దుర్ఘటనలో బాధితురాలు అయిన డాక్టర్ ప్రియాంకకు న్యాయం చేకూరాలని దేశమంతా ఒక్కటై గళం విప్పుతుండగా... పోలీసు విచారణలో మరి కొన్ని షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే తాము ఆమెను ఎలా చంపారన్నది పూసగుచ్చినట్లు వివరించిన ఆ నలుగురుని ఇప్పుడు ఇంకొంచెం లోతుగా విచారణ చేస్తే అసలు జరిగిందంతా వివరంగా చెప్పారు. వారు చెప్పిన మాటలు విని పోలీసులకు అసలు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

 

అసలు జరిగిందేమితంటే సాయంత్రం టోల్ గేట్ వద్ద స్కూటీని పార్క్ చేసి వెళ్లిన ప్రియాంక కోసం ఆమె టైర్ పంక్చర్ చేసి నిందితులు నలుగురు కాపు కాసిన విషయం తెలిసిందే. వారిలో ఒక నిందితుడు ఆమె స్కూటీని రిపేర్ చేయించుకొని వచ్చేందుకు తీసుకుని వెళ్లగా ఆమె టోల్ గేటు వద్దనే వెలుతురు ఉన్న ప్రాంతంలో నిలబడి ఉంది. ఈ మధ్యలో ఇంకా ఏంటి ఆలస్యం అని రెండవసారి స్కూటీ పంచర్ వేయించుకొని రావడానికి వెళ్ళిన నిందితుడికి ఫోన్ చేసింది. అయితే ఆమెను అక్కడి నుండి నుంచి చీకటి ప్రాంతంలోకి తీసుకుని వెళ్లేందుకు నిందితులకు ఏం చేయాలో అర్థం కాని సమయంలో కొంతమంది వారికి పరోక్షంగా సహాయం చేశారట.

 

మామూలుగా అర్ధరాత్రి పూట ఒక ఆడపిల్ల అలా హైవే పైన ఒక్కటే కనిపిస్తే ఏ ఆకతాయి అయినా ఏమనుకుంటాడు? అలా ఆమె గురించి తప్పుగా భావించి అటువైపుగా వెళుతున్న కొంతమంది పలుమార్లు విజిల్ వేయడం మరియు ఇన్ డైరెక్ట్ గా ఆమెకు వినిపించేలా అసహ్యపు మాటలు మాట్లాడడంతో ఆమె అక్కడి నుండి నిందితులను నమ్మి ముందుకు వెళ్ళింది. ఆ సమయంలోనే ఆమె తన చెల్లికి ఫోన్ చేసి తనకు భయంగా ఉనట్లు నిందితులను పోలీసులు చెప్పారట. ఇదే అదనుగా తలచిన ఆ నలుగురు తమలోని మృగాలను బయటికి తెచ్చి ఈ నీచమైన పనికి ఒడిగట్టాడు. ఇప్పుడు వారితో పాటు మనలో ఉన్న చెడు ఆలోచనలు మరియు వక్రబుద్ధికి కూడా శిక్ష ఎవరు వేస్తారు?

మరింత సమాచారం తెలుసుకోండి: