తాజాగా యువతులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని సమాజం అంతా గర్జిస్తుంటే మరో వైపు ఓ మాజీ ఎమ్మెల్యే కొడుకు మద్యం మత్తులో రెచ్చి పోవడం జరిగింది. పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నదీశ్వర్ గౌడ్ కొడుకు ఆశిష్ గౌడ్ హల్ చల్ చేయడం జరిగింది. హైదరాబాద్ లో మాదాపూర్ లోని ఓ పబ్ లో ఫుల్లుగా మద్యం సేవించిన ఆశిష్ గౌడ్… ఆ మత్తులో పబ్బులో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులు చేయడం మొదలు పెట్టాడు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసు స్టేషన్ లో హీరోయిన్ సంజనా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది.
ఇక ఘటనపై పూర్తి వివరాలు ఇలా... హైదరాబాద్, హైటెక్స్ సమీపంలోని నోవాటెల్ హోటల్ లో శనివారం అర్థరాత్రి 2 గంటల సమయంలో తన స్నేహితురాలితో కలిసి నిలబడివున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అని, వేదింపులతో భయభ్రాంతులకు గురై, తప్పించుకున్నామని తెలియచేయడం జరిగింది. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించగా అసలు నిజం బయటికి రావడం జరిగింది.
ఆశిష్ ఫుల్లుగా మద్యం సేవించి మాదాపూర్లోని హైటెక్స్లోని నోవాటెల్ హోటల్లో హల్చల్ చేసినట్టు నటి సంజన తన ఫిర్యాదులో పూర్తి వివరాలు తెలియచేయడం జరిగింది. అంతేకాదు అతను తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే గాక, అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించాడని ఆమె తెలిపింది పోలీసులతో. ఇక పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు మొదలుపెడతామని, నోవాటెల్ హోటల్ లోని సీసీటీవీ ఫుటేజ్ లను చూసి తగిన చర్యలు తీసుకుంటామని యువతులకు వారు హామీ ఇవ్వడం జరిగింది.
నటి సంజన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టా మద్యం మత్తులో ఆశిష్ గౌడ్ యువతులను చితకబాదినట్లు సంచరం వినిపిస్తుంది. అడ్డుకున్నవారిపై కూడా ఆశీష్ గౌడ్తో పాటు ఆయన స్నేహితులు దాడి చేసినట్లు సంజన సహా ఇంకొందరు అమ్మాయిలు కూడా పిర్యాదు చేయడం జరిగింది. దీంతో సెక్షన్ 354, 354ఏ, 509 కింద కేసు నమోదు చేయడం జరిగింది.. . ఆశిష్ గౌడ్పై క్రైమ్నంబర్ 948/2019 కింద కేసు నమోదు చేయడం జరిగింది అని మాదాపూర్ పోలీసులు తెలియచేయడం జరిగింది.