ఆడపిల్ల అంటేనే చిన్నపిల్ల సమయం నుండి పెద్దయ్యే వరుకు ఎంతో జాగ్రత్తగా తల్లిదండ్రుల సంరక్షణలో ఎంతో జాగ్రత్తగా పెరుగుతారు. కానీ కొందరు కామాంధులు నీచులు ఆ ఆడపిల్లల జీవితాన్ని కొన్ని క్షణాల వ్యవధిలోనే ఛిదిమేస్తారు. ఆలా చిదిమేసిన ఘటనే డాక్టర్ ప్రియాంక రెడ్డి ఘటన.

 

ఆమె గురించి విన్న ప్రతిఒక్కరి కంట కన్నీళ్లు.. కోపం కలిపి వస్తున్నాయి. జీవితంపై ఎన్నో ఆశలు.. ఆశయాలతో చదువుకొని.. డాక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రియాంక రెడ్డిపై మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన వ్యక్తులు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసి చెటాన్‌పల్లి బైపాస్‌ రోడ్డు అండర్‌ బ్రిడ్జి కింద పెట్రోలు పోసి దహనం చేశారు.

 

ఇంత దారుణం చేసిన వారిని చంపేయాలని.. ముక్కలుముక్కలుగా నరికేయాలని వారి కోపంను క్రోధాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిన్న పిల్లల నుండి పెద్దల వరుకు బాధతో కూడిన కోపం వారి గొంతు నుండి వస్తుంది. దీంతో షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న నిందితులను చంపేయాలని అక్కడికి ప్రజలు భారీ ఎత్తున వచ్చారు.   

 

చంపేస్తాం వాళ్ళని అని మమ్మల్ని జైల్లో పెట్టుకోండి అని పోలీసులపైనే నిరసనకారులు చెప్పులు విసిరారు. అయితే ప్రియాంక ఇంటి వద్ద పోలీస్ స్టేషన్ దగ్గర మాకు న్యాయం కావాలని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ యూట్యూబర్ ప్రియాంక నిందితుల చివరికి కోరికలు ఇలా ఉంటాయని వీడియో తీశాడు. 

 

ఆ వీడియోలో ఆడవారిపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి.. రోజుకు 150మందిపైగా అత్యాచారాలు జరుగుతున్నాయి.. మా ఇండియన్ గవర్నమెంట్ వేస్ట్.. మన పోలీసులు, కోర్టులు అన్ని వేస్ట్ అని అతను చెప్తూ.. ప్రియాంకను అంత దారుణంగా అత్యాచారం చేసి చంపినా సరే వారిని కోర్టు చివరి కోరిక అని అడుగుతుంది. 

 

ఆ సమయంలో కూడా ఆ నీచులు ఎలాంటి కోరికలు కోరుతారు అంటే అప్పుడు కూడా వారికీ ''నయనతార, త్రిష''ని తీసుకురండి రేప్ చేసి చంపేస్తాం అని కోరుతారు ఆ నీచులు. అలాంటి నీచులను మన ప్రభుత్వాలు చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. ఇది మన ప్రభుత్వం అని తన భాదను అంత ఓ వీడియో ద్వారా చెప్పుకున్నాడు. అయితే ఈ వీడియో చేసిన యూట్యూబర్ ఇది డబ్బు కోసం చెయ్యలేదు కేవలం ఈ ఘటనపై మన ఇండియన్ గవర్నమెంట్ ఎంత దారుణంగా స్పందిస్తున్నాను అంటూ వీడియో తీశాడు. ఆ వీడియోను మీరు ఒకసారి చుడండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: