అత్తమామలు అంటే వేరే ఇంటినుండి తమ  ఇంటికొచ్చిన కోడల్ని కన్న కూతురిలా చూసుకుని ... ఎలాంటి ఆపదా రాకుండా చూసుకోవాలి కానీ ఇక్కడ అత్తమామలు మాత్రం పెళ్ళయిన కొన్ని రోజులకే కోడళ్లకు అదనపు కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టారు . అదనపు కట్నం తీసుకురావాలని చిత్రహింసలు చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఆ యువతి అదనపు కట్నం తెచ్చేందుకు నిరాకరించడంతో ఆ అత్తమామలు ఏకంగా కోడలిపై ఓ  దురాగతానికి పాల్పడ్డారు. అదనపు కట్నం తేవడం లేదని రాత్రికి రాత్రే ఆ కోడలని సెక్స్ రాకెట్ అమ్మేసారు . నాలుగేళ్ల తర్వాత బాధితురాలు వెలుగులోకి రావడంతో అసలు విషయం బయటికి వచ్చింది . బీహార్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. 

 

 

 

 వివరాల్లోకి వెళితే... బీహార్లోని కతిహార్ జిల్లా  ఠాణా కోడా ప్రాంతానికి చెందిన యువతి అరియరుయా  జిల్లాకు చెందిన మహమ్మద్ అమిమ్ అనే వ్యక్తిని ఏళ్ల క్రితం వివాహం చేసుకుంటుంది . వివాహం చేసుకునే ముందు యువతీ కుటుంబం అన్ని లాంఛనాలు  పూర్తిచేస్తారు యువతి తల్లిదండ్రులు. అయితే పెళ్ళయిన కొన్ని రోజులకే ఆ యువతికి వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం తీసుకురావాలని అత్తమామలు వేధించడం మొదలుపెట్టారు. 2015 సంవత్సరంలో పంచాయతీ జరగడంతో కోడలిని  జాగ్రత్తగా చూసుకోవాలని పంచాయతీ పెద్దలు సదరు అత్తమామలకు సూచించారు. కానీ పంచాయతీ జరిగిన రెండు రోజుల తర్వాత ఆ యువతి కనిపించకుండా పోయింది. ఎక్కడికి వెళ్లిందో తనకు తెలియదంటూ అత్తమామలు మాయ మాటలు చెప్పి అందరినీ నమ్మించారు  కాగా ఆ యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇక ఆ యువతి కోసం చాలా వెతికినప్పటికీ  కూడా యువతి ఆచూకి లభించలేదు . 

 

 

 

 దీంతో యువతి మిస్సింగ్ విషయాన్ని అందరూ మర్చిపోయారు. అయితే  గత కొద్ది రోజుల క్రితం ఆ యువతి మల్లి తిరిగి తల్లితండ్రులకు దగ్గరకు చేరుకుంది. తల్లితండ్రుల  దగ్గరికి చేరుకున్న యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపి బోరున విలపించింది. తన అత్తా మామలు తనను రెడ్ లైట్ ఏరియా అమ్మేశారని అక్కడ నాలుగేళ్లుగా తనతో బలవంతంగా వ్యభిచారం చేయించారని అంటూ వాపోయింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి జరిగిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో పంచాయితీ జరిగిన రెండు రోజుల తర్వాత అత్తమామలు తనకు మత్తుమందిచ్చరని ... ఆ తర్వాత తేరుకుని చూసేసరికి కాన్పూర్లోని వ్యభిచార గృహం లో ఉన్నానని ఆ యువతి తెలిపింది. డబ్బుల కోసం సెక్స్ రాకెట్ కు తనను  అమ్మేసారు అన్న విషయం తెలిసి  షాక్ కి గురయ్యానని ...అక్కడి  నుంచి తప్పించుకునే మార్గం లేక ఇన్ని రోజులు బయటకు రాలేక పోయాను అని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. నాలుగేళ్లపాటు వ్యభిచార కూపంలో బతికిన తాను ఆ తర్వాత ఎలాగోలా  అక్కడినుంచి తప్పించుకుని వచ్చాను అంటా యువతి  ఫిర్యాదులో పేర్కొంది.తన  జీవితం నాశనం చేసిన భర్త అత్తమామల పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: