హైదరాబాద్ షాద్నగర్ సమీపంలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి అత్యాచారం హత్య ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. మానవ మృగాల్లాంటి నలుగురు మగాళ్లు అమాయకపు ఆడపిల్లని అతి దారుణంగా అత్యాచారం చేశారు అనంతరం హత్య చేసిన ఘటన అందరినీ కలిచివేసింది. ప్రియాంక రెడ్డి అత్యాచార హత్య కేసు నిందితులకు ఉరిశిక్ష పడాలి అంటు దేశం మొత్తం నినదిస్తోంది. వీ వాంట్ జస్టిస్ అంటూ ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తమవుతున్నాయి.నిర్భయ లాంటి కఠిన చట్టాలను తీసుకు వచ్చిన తర్వాత కూడా మహిళలపై అత్యాచారాలు జరగడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కాగా ప్రియాంక రెడ్డి హత్య ఉదంతం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం.
మొన్నటిదాకా తమ కళ్లముందు కనిపించిన ప్రియాంక రెడ్డి ఇక మళ్ళీ కనిపించదనే చేదు అనుభవాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేక అరణ్యరోదనగా విలపిస్తోంది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురిని చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మృతురాలి మామ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తమ కులం లో పెళ్లికాని యువతీ యువకులు చనిపోతే... మొదట ఓ చెట్టు తో పెళ్లి చేసి ఆపై దహన సంస్కారాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కానీ తన కోడలు ప్రియాంక రెడ్డి కనీసం వాటికి కూడా నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన.
ప్రియాంక రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించడం తప్ప కనీసం ఏం చేయలేకపోతున్నామని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక రెడ్డి అత్యాచారం హత్య కేసు నిందితులను ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తర్వాత ఎంతటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఇప్పటికీ... మహిళలపై అత్యాచారాలు హత్యలు ఘటనలు జరగటం తీవ్ర శోచనీయమని ఆయన అన్నారు. తన కోడలికి జంతువులంటే ఇష్టమని అందుకే మెడిసిన్ సీటు వచ్చినప్పటికీ జంతువుల ఇష్టంతో ఎంతో కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నానని తెలిపారు. జంతువులను పెంచడం కూడా తన కోడలుకి ఎంతో ఇష్టమని కానీ ఇళ్ళు చిన్నది కావడం వల్ల కుదరడం లేదన్నారు. జాబ్ రావడంతో కుటుంబాన్ని శంషాబాద్ షిఫ్ట్ చేసిందని ప్రియాంక రెడ్డి మామ తెలిపారు.