డాక్టర్ ప్రియాంక రెడ్డి.. ఆమె గురించి విన్న ప్రతిఒక్కరి కంట కన్నీళ్లు.. కోపం కలిపి వస్తున్నాయి. జీవితంపై ఎన్నో ఆశలు.. ఆశయాలతో చదువుకొని.. డాక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రియాంక రెడ్డిపై మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేసి చెటాన్‌పల్లి బైపాస్‌ రోడ్డు అండర్‌ బ్రిడ్జి కింద పెట్రోలు పోసి దహనం చేశారు.

 

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన నిందితులు జైలులో ఉన్న తెలుగు ప్రజలంతా ఘటనపై తీవ్ర వ్యతిరేకత తెలుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా నాయకుల నుండి రాజకీయ నాయకుల వరుకు ప్రతి ఒకరు ఆమెకు సంతాపం తెలుపుతు ఆమె తల్లిదండ్రులను పరామర్శిస్తున్నారు.

 

అయితే ఉదయం మమ్మల్ని ఎవరు పరామర్శించకండి.. ఇంట్లోకి ఎవరు రాకండి.. రాజకీయనాయకులు, మీడియా వాళ్ళు ఎవరు రాకండి.. మాకు న్యాయం చెయ్యండి చాలు అని వాళ్ళు తేల్చి చెప్పారు. అయితే ఈ ఘటనపై సినీ నటులు అందరూ స్పందించగా ఉదయం మహేష్ బాబు ఆడియో వైరల్ అవ్వగా ప్రస్తుతం వెంకటేష్ వీడియో వైరల్ అవుతుంది.  

 

వెంకటేష్ స్పందిస్తూ.. రేప్ అండ్ మర్డర్ అనేది ఒక్క ఆడవాళ్ల అంశమే కాదు, ఎందుకు మగవాళ్లు, అబ్బాయిలు దీని గురించి మాట్లాడటానికి ముందుకు రావడం లేదు. ఎందుకు నిరసన తెలపడం లేదు.. గొంతు ఎత్తడం లేదు.. అమ్మాయిలంటే వస్తువులు కాదు నీ సొంతం అనుకోడానికి.. గౌరవం, స్వేచ్ఛ వాళ్ల హక్కు అని గుర్తించుకోవాలి. అబ్బాయిలకు చెప్పండి బాధ్యతగా నడుచుకోమని సత్ప్రవర్తన నేర్చుకోమనండి.. అంతా జరిగిపోయిన తర్వాత రియాక్షన్ కాదు యాక్షన్ కావాలని వెంకటేష్ ఈ ఘటనపై స్పందించాడు. ఇప్పటికే మహేష్ బాబు ఆడియో వైరల్ అవుతుండగా ఇప్పుడు వెంకటేష్ వీడియోను వైరల్ అవుతుంది. 

 

ఎంతమంది స్పందించిన కావాల్సింది న్యాయం.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అమ్మాయిపై యాసిడ్ ఎటాక్ జరిగినప్పుడు నిందితులను ఎలా ఎన్కౌంటర్ చేసారో అదే న్యాయం ఇప్పడు కావాలి.. మరి ఈ ఘటనకు న్యాయం చేస్తారా ? లేదా అనేది తెలంగాణ సర్కార్, లాయర్లే డిసైడ్ కావాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: