తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో మరో కొత్త మలుపు తిరిగింది. తమ మాట వినకుండా ప్రేమ పెళ్లి చేసుకుందని కక్షతో అమృత తండ్రి తిరునగరు మారుతిరావు అమృత భర్త ప్రణయ్ ను కిరాయి రౌడీలతో అతి కిరాతకంగా చంపించిన సంగతి తెలిసిందే. గత సంవత్సరంలో ఈ ఘటన ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే. 

                           

అయితే ఈ ఘటనలో అప్పట్లో జైలు కెళ్లిన మారుతీ రావు ఈ మధ్యనే విడుదల అయ్యారు. అయితే మారుతీ రావు జైల్లో ఉన్న సమయంలోనే అమృత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పుడు ఈ అమృత ప్రణయ్ కేసులో మరో మలుపు తిరిగింది. ఆ మలుపు ఏంటంటే..  

                                     

మారుతీరావు, ఎంఏ కరీంలపై మిర్యాలగూడ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. సీఐ సదానాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. అమృత వర్షిణిని కోర్టులో అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని తన తండ్రి, హంతకుడు కరీం కొద్దిరోజుల క్రితం నుండి బెదిరిస్తున్నాడు అని, 

 

అలాగే కొద్ది రోజుల క్రితం మారుతీరావు తన స్నేహితుడైన కందుల వెంకటేశ్వరరావును అమృత ఇంటికి పంపించి 'మీ తండ్రి చెప్పినట్లు నడుచుకుంటే మీ నాన్న తన ఆస్తినంతా నీకు రాసిస్తా అంటున్నాడు. ఆయనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆస్తిపాస్తులన్నీ నీకే దక్కేలా చేస్తానంటున్నాడు' అని వెంకటేశ్వరరావు అమృతను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించగా ఆమె అందుకు నిరాకరించింది. అయితే ఇందుకు నిరాకరించిన అమృత వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: