వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరగుతోందా.. జగన్ ను ఓ పథకం ప్రకారం గద్దె దింపేందుకు వ్యూహ రచన జరుగుతోందా.. అంటే అవునంటున్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఈయన స్వయంగా జగన్ కు బాబాయి కూడా. జగన్ ప్రభుత్వంపై మత ముద్ర వేసి.. రాజకీయంగా పెను కుట్రకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.

 

టీటీడీ వెబ్ సైట్లు శ్రీయేసయ్య అనే నినాదం ఉందంటూ తాజాగా సోషల్ మీడియాలో హోరెత్తిన ప్రచారంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. గతంలో కూడా తిరుమలలోని ఏడు కొండలపై సిలువ గుర్తు ఉందంటూ, బస్సు టికెట్ లో ఇతర మతాల గుర్తులు ఉన్నాయంటూ దుష్ప్రచారం చేసారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. టీటీడీని భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు.

 

టీటీడీ వెబ్‌సైట్‌లో దుష్ర్పచారం జరగకుండా ఉండేందుకు సైబర్‌క్రైమ్‌ను ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరతామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. వివాదానికి కారణమైన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి పాలకమండలిలో చర్చించి వాటిపై నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

 

వైకుంఠ ద్వారాలు పదిరోజులు తెరుస్తామని టీటీడీ ఎలాంటి ప్రకటన చేయలేదని టీటీడీ ఈవో సింఘాల్‌ పేర్కొన్నారు. టీటీడీ పంచాంగంలో శ్రీయైనమః పదానికి బదులుగా గూగుల్ అనువాదంలో శ్రీయేసయ్య నమః అని వచ్చినట్లు తెలిపారు. ఫోటోగ్రాఫ్ లో ఉన్న పదాలను ప్రాంతీయ భాషల్లో అనువాదం చేయడంలో గూగుల్ లో పొరపాట్లు జరుగుతుంటాయని ఆయన వివరించారు.

 

అధికారికంగా ఏ నిర్ణయం తీసుకోకుండానే మీడియాలో చర్చలు పెడుతున్నారని ఈవో విమర్శించారు. అసలు అన్యమత ప్రచారం చేస్తున్న విషయం టీటీడీ వెబ్‌సైట్లో లేదని, గూగుల్‌ సెర్చ్‌లో మాత్రమే అది కనిపిస్తోందని ఈవో గుర్తు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: