'ఏమో సార్‌.. అప్పుడు మేం ఫుల్లుగా తాగి ఉన్నాం. ఏం చేస్తున్నామో సోయి లేదు. పొద్దున్నుంచి ఖాళీగా లారీలో కూర్చొని విసుగు పుట్టింది. ఒంటరిగా యువతి కనిపించగానే ఏదో ఒకటి చేయాలని అనుకున్నాం’ అంటూ రిమాండ్ లో ఉన్న వైద్యురాలు హత్యోదంతం నిందితులు.. విచారణలో వెల్లడించడంతో.. పోలీసులు షాక్ అయ్యారు.


అయితే వారు బాధితురాలు వచ్చేంతవరకు ఏం చేసారో కూడా పోలీసుల విచారణలో వెళ్లగక్కారు. ఇనుప కడ్డీలను దొంగలించి వాటిని భద్రంగా ఎక్కడో ఒకచోట దాచి.. వీలున్నప్పుడు విక్రయించడం.. వచ్చిన డబ్బులతో పీకల దాక మందు తాగడం ఈ నిందితులకు బాగా అలవాటు. ఇదే తరహాలో కొన్ని రోజుల క్రితం దొంగలించిన ఇనుప కడ్డీలను అమ్మడం కోసం.. నవీన్‌.. చెన్నకేశవులను, ప్రధాన నిందితుడు మహ్మద్‌ ఆరీఫ్‌ పాషాను తోడుగా పిలిచాడు. ఇక వారంతా కలిసి దొంగలించిన కడ్డీలను.. నవంబర్ 26వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల సమయంలో అమ్మేసారు. ఆ తర్వాత రాత్రి టైం లో శంషాబాద్‌ శివారుల్లోని తొండుపల్లికి చేరుకున్నారు. ఆ తర్వాత 27వ తారీకు పొద్దున్న తొమ్మిది గంటల సమయంలో.. తోడిపల్లి ఓఆర్‌ఆర్‌ కూడలి వద్దకు చేరుకున్నారు. ఇక అప్పటి నుంచి సాయంత్రం 5:30 వరకు ఏం జరిగిందో ఇంకా మిస్టరీగానే ఉంది.

ఆ తర్వాత వీళ్ళు విచారణలో ఇంకా మాట్లాడుతూ మరిన్ని విషయాలను బయటపెట్టారు. వైద్యురాలు సాయంత్రం వేళలో బండి పార్క్ చేయడం చూసారని అప్పుడే ఆమెపై కన్నేశారని చెప్పారు. అప్పటివరకు మద్యం తాగుతున్న ఈ నలుగురు.. స్కూటీని పార్క్ చేసి వెళ్లిన ఆమె ఎంత ఆలస్యంగా వస్తే.. వారు చేయబోయే నేరం అంత సులభం అవుతుందని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నట్లు తెలిపారు. గ్యాంగ్ రేప్ చేసిన తర్వాత అక్కడినుంచి తక్షణమే పరారవ్వొచ్చని పిచ్చిగా ఊహించుకున్నారు. ఆమె 9 గంటల సమయంలో బండి దగ్గరకి వచ్చింది.. అప్పటి వరకు తోడేళ్ళలాగా వేచి చూసిన వారు ఆమె రాకను గమనించగానే వెంటనే లారీ నుంచి క్రిందికి దిగారు. ఆమె శరీరాన్ని దహనం చేసి చంపేస్తే ఇంత దూరం వస్తుందనుకోలేదు సార్ అంటూ అక్కడ విచారణ చేస్తున్న పోలీసులను విస్తుపోయేలా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: