తెలంగాణ రాష్ట్రం వరుస అత్యాచారాలతో మారు మోగిపోతుంది. కనీసం ఎక్కడో ఒకచోట కామాంధులు ఆడపిల్లలపై కాకుల్లా వాలి, తోడేళ్లలా వారి కలలను చిదిమేస్తున్నారు. ఇకపోతే నిజాంపేటలోని ఓ అపార్టుమెంట్‌లో తన అక్కతో కలిసి ఉంటున్న యువతిని రేప్ చేసిన కేసులో నిందితుణ్ని పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు.

 

 

అతను కర్ణాటకలోని గుల్బర్గాలో ఉన్నట్లు తెలుసుకొన్న పోలీసులు అక్కడికి వెళ్లి అతన్ని అరెస్టు చేశారు. అయితే ఈ కేసుపై కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకట్లేదంటున్నారు.. అమ్మాయి రేప్ కు గురైందా లేదా నిందితుడు అత్యాచార యత్నం మాత్రమే చేశాడా అనేది తెలియవలసింది ఉంది. ఒకవేళ అత్యావారం జరుగకుంటే బాధితురాలు... స్పృహలోకి రావడానికి ఒక రోజు ఎందుకు పట్టిందన్నది తేలాల్సిన ప్రశ్న.

 

 

రేప్ జరగకపోతే... బాధితురాలు అర్థ నగ్నంగా ఎందుకు ఉందన్నది మరో ప్రశ్న. ఒక వేళ రేప్ జరగకపోయి ఉన్నా... బాధితురాలిని రేప్ చెయ్యాలనే ఉద్దేశంతోనే వివస్త్రను చేశాడు కాబట్టి... అది అత్యాచారమే అంటున్నాయి మహిళా సంఘాలు. దీనిపై పోలీసులు క్లారిటీ ఇవ్వాలని వారు కోరుతున్నారు.

 

 

ఇకపోతే ఉదయం 11 గంటలకు అపార్ట్ మెంట్ కు వచ్చిన అతను సాయంత్రం 3.30 వరకు ఆ ఫ్లాట్‌లోనే గడిపాడు. ఇంత సమయం వరకు లోపల ఉన్న వ్యక్తి ఏమి చేయకుండా ఉంటాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఇప్పటి వరకు బాధితురాలిపై అత్యాచారం జరిగిందా లేదా అన్నది పోలీసులు కన్‌ఫాం చెయ్యలేదట.

 

 

కానీ జరిగే ఉంటుందని అంతా అనుకుంటున్నారు. 11 గంటల నుంచీ 3.30 గంటల వరకూ అదే ఫ్లాట్‌లో ఉన్న నిందితుడు... రేప్ చెయ్యలేదంటే ఎలా నమ్ముతామని ఇప్పటికే మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇకపోతే ఘటన జరిగిన తర్వాతి రోజు స్పృహలోకి వచ్చిన బాధితురాలు ఏం చెప్పిందన్నది తేలాల్సి ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: