ఓ వైపు ఆర్టీసీ చార్జీల పెంపు నేటి నుంచి అమల్లోకి వస్తుండగా మరోవైపు హైదరాబాద్ నగర వాసులకు ప్రజరవాణ వ్యవస్థ అయిన మెట్రో షాకిచ్చింది. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలను కిలోమీటర్కు 20 పైసల చొప్పున పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు రూపొందించి అందజేశారని, వాటికి సీఎం కేసీఆర్ ఓకే చెప్పారని తెలిసింది. అయితే ఇన్చార్జి ఎండీ సునీల్శర్మ పరిశీలనలో ఉన్నందున జాప్యం జరుగుతోంది. అయితే, ఇదే సమయంలో హైదరాబాద్ మెట్రో ఊహించని షాక్ ఇచ్చింది. ఉచిత పార్కింగ్ అనే వెసులుబాటెకు విరుద్ధంగా ఛార్జీలు వసూలు చేస్తోంది. రోజంతా బండి పార్క్ చేస్తే 10రూపాయలు తీసుకునేవారు. ఇప్పుడు డబుల్ చేసి 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. తద్వారా డబుల్ షాక్ ఇస్తునన్నారు.
హఠాత్తుగా, అమాంతం పార్కింగ్ ఫీజును పెంచడంపై అదే సమయాల్లో అసౌకర్యాలపై ప్రయాణికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మెట్రో ప్రారంభమైన మొదట్లో పార్కింగ్ ఫీజులు వసూలు చేయలేదు. ఏడాది తర్వాత నామమాత్రంగా రోజంతా బండి పార్క్ చేస్తే 10రూపాయలు తీసుకునేవారు. ఇప్పుడు డబుల్ చేసి 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. పార్కింగ్ కూడా ఉదయం ఆరింటి నుంచి రాత్రి తొమ్మిదింటి వరకే అనుమతిస్తున్నారు. సెక్యూరిటీ లేదనే కారణంతో రాత్రి తొమ్మిది తర్వాత వెహికిల్స్ పట్టించుకోవడం లేదు. ఇక కార్లు పెట్టుకునేందుకు మెట్రో స్టేషన్ల దగ్గర స్థలం కూడా ఉండట్లేదు. దాదాపు అన్ని స్టేషన్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
కొన్ని ప్రాంతాల్లో ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని ఎత్తేసి… భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఎల్బీనగర్ లో ఇప్పటి వరకూ లేని పార్కింగ్ ఫీజును కొత్తగా ప్రారంభించారు. ఇక్కడ కనీసం పార్కింగ్కు సరైన ప్లేస్ లేదు. పార్కింగ్ చేసే స్థలంలో షెడ్లు లేకపోవడంతో వాహనాలు ఎండకు ఎండి, వర్షానికి తడుస్తున్నాయి. ముందు మెట్రో స్టేషన్ల దగ్గర సరైన పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశాక డబ్బులు వసూలు చేయాలంటున్నారు. ఆర్టీసీ సమ్మెతో మెట్రోలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. కానీ పెరిగిన ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో మెట్రో అధికారులు విఫలమవుతున్నారని, పైగా జేబులు గుల్ల చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఈ చార్జీల భారంపై ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.