ఇప్పటికే దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువశాతం వర్షాలు కురిసి  ప్రజలను బెంబేలెత్తిస్తున్న  విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలు భారీ వర్షాలతో అల్లాడిపోయారు. వర్షాలతో ఎంతోమంది ప్రాణాలు సైతం కోల్పోయారు. ఇక దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎన్నో గ్రామాలు నీట మునిగిపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది. అయితే నిన్న బంగాళాఖాతంలోని దక్షిణ ధ్రువంలో  ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణ శాఖ అధికారులు తెలిపారు . ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 

 

 

 అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు కోయంబత్తూరులో భారీ వర్షాలు కురిసాయి. కోయంబత్తూరులో భారీగా కురిసిన వర్షాలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఎటు వెళ్ళని పరిస్థితి నెలకొంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి వర్షాలు . కోయంబత్తూరు జిల్లా మిట్టపాలెం లో భారీ వర్షాలకు ఏడంతస్తుల భవనం కుప్పకూలి పోయింది. ఈ భవనం ఒక్కసారిగా కుప్పకూలి పోవడంతో ఏడంతస్తుల భవనం లో నివసిస్తున్న ఎంతోమంది భవన శిధిలాల కింద ఇరుక్కుపోయారు.కాగా అకస్మాత్తుగా  భారీ వర్షాలకు ఏడంతస్తుల భవనం కూలిపోవడంతో భవనం లో నివసించే ప్రజలు తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది.

 

 

 

 ఇప్పటికే 12 మంది మృతి చెందినట్లు గుర్తించారు సహాయక సిబ్బంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికి శిథిలాల కింది నుంచి తొమ్మిది మంది మృతదేహాలను బయటకు తీశారు పోలీసులు. అయితే భవనం కూలిన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు హుటాహుటిన  చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. కూలిన సమయంలో ఏడంతస్తుల భవనం లో ఎక్కువమంది ప్రజలు ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. సహాయక చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: