తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అబ్దుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి కేసులో మరో విషాదం జరిగింది. విజయా రెడ్డిని కాపాడే క్రమంలో తీవ్రంగా గాయపడిన అటెండర్ చంద్రయ్య కూడా చనిపోయారు. కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్టీవో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇకపోతే గత నెల 4 నుంచి చంద్రయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత నెల 4న హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మె‌ట్ ఎమ్మార్వో విజయారెడ్డిపై సురేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

 

 

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విజయారెడ్డి అక్కడికక్కడే చనిపోగా.. దాడికి పాల్పడ్డ సురేష్, అటెండర్ చంద్రయ్య, ఎమ్మార్వో విజయారెడ్డి కారు డ్రైవర్ గురునాథం తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సురేష్, కారు డ్రైవర్ గురునాథం రెండు మూడు రోజుల వ్యవధిలో చనిపోగా..  అటెండర్ చంద్రయ్య మాత్రం 28 రోజుల పాటూ మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు.

 

 

ఇకపోతే గత 28 రోజులుగా ఆస్పత్రి బర్నింగ్ వార్డులో చికిత్స పొందుతున్న చంద్రయ్య ఆరోగ్యం ఆదివారం కాస్త విషమించింది. ఆయనకు ఉన్నట్టుండి మాట పడిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురు కావడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. చంద్రయ్య ఆరోగ్య పరిస్థితిని గమనించిన డాక్టర్లు.. ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌‌పై చికిత్స చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి 24 గంటలు గడిస్తేగానీ ఏమి చెప్పలేమని అన్నారు.

 

 

ఇంతలోనే ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం ఉదయానికి చంద్రయ్య చనిపోయాడు.. ఇక ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం రేపింది. ఓ వ్యక్తి నేరుగా ఎమ్మార్వో ఆఫీసులోకి వెళ్లి పెట్రోల్‌తో దాడి చేసి చంపడం కలకలం రేపింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఎమ్మార్వో ఆఫీసుల్లో భద్రతను పెంచారు. ఇకపోతే ఈ సంఘటనలో ఇప్పటి వరకు  మరణించిన వారి సంఖ్య మొత్తం నలుగురు.

 

 

ఇక సురేష్ తన మరణ వాంగ్ములలో ఓ భూమికి సంబంధించి పట్టా కోసం తహశీల్దార్ కార్యాలయం చుట్టూ కొంతకాలంగా తిరుగుతున్నా ఆ భూమికి సంబంధించి కోర్టు కేసులు, జేసీ ఆదేశాలు ఉన్నాయని, కావునా తాను ఎంత వేడుకున్నా పట్టా ఇవ్వడం కుదరదని తహశీల్దార్ విజయారెడ్డి సురేష్‌కు చెప్పారట. అందుకే విసుగు చెంది తనపై పెట్రోలు పోసుకొని.. తర్వాత ఆమెపై పోశానన్నాడు. తనకు నిప్పంటించుకొని ఆమెను కూడా తగులబెట్టానని చెప్పాడు. తాను కూడా చనిపోవాలని నిర్ణయానికి వచ్చాకే ఈ పని చేశానని చెప్పాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: