ఇటీవల రేప్ చేయబడి అనంతరం హత్య గావింపబడ్డ వెటర్నరీ ప్రియాంక రెడ్డి హత్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటన పై మహిళా, ప్రజా సంఘాలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇక ప్రజలతో పాటు రాజకీయ, సినిమా ప్రముఖులు కూడా ఆమె హత్యను ఖండిస్తున్నారు. రాను రాను సమాజంలో ఆడవారికి రక్షణ లేకుండా పోతోందని, ఆడవారు స్వేచ్ఛగా పగటి పూట కూడా ధైర్యంగా తిరగలేని నీచమైన పరిస్థితికి ప్రస్తుత సమాజం వచ్చిందంటే, మనం ఎంత దారుణమైన బ్రతుకు బ్రతుకుతున్నామో తలచుకుంటేనే ఎంతో అసహ్యం వేస్తోందని పలు సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రియాంక  రెడ్డి హత్య ఘటన నిందితులను 24 గంటల్లో పట్టుకున్న పోలీసులు, ఘటన వివరాలను ఆ సమయంలోనే తెల్పడం జరిగింది. ఇక మొన్న వారిని పూర్తిగా విచారించిన అనంతరం నిందితులను కోర్ట్ లో హాజరు పరిచిన పోలీసులు, 

 

ఆ సమయంలో సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో దారుణమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ముందుగా నిందితులు సాయంత్రం నుండి మద్యం సేవిస్తూ, ప్రియాంక కదలికలను గమనించడంతో పాటు ఆమెను ఎలాగైనా అనుభవించాలని నీచమైన కోరికను కలిగి ఉన్నారట. ఆ ఉద్దేశ్యంతోనే ఆమె టైర్ పంక్చర్ చేసారని, అయితే అనంతరం వారు టైర్ పంక్చర్ వేయిస్తాం అని చెప్పిన మాటలు ప్రియాంక నమ్మడం వారికి కలిసి వచ్చిందట. ఆ తరువాత పంక్చర్ విషయమై కొంత డ్రామా క్రియేట్ చేసిన నిందితుల్లో ఇద్దరు ప్రియాంక కాళ్ళను పట్టుకోగా, మరొక ఇద్దరు చేతులు పట్టుకుని ప్రక్కనే ఉన్న పాత ఇంటివద్దకు తీసుకెళ్లి ఒక్కొక్కరుగా అత్యాచారానికి పాల్పడ్డారని, అలానే ఆ సమయంలో ఆమె గొంతులో కొంత మద్యం పోశారని తెలుస్తోంది. అయితే మధ్యలో కాసేపటికి ప్రియాంక స్పృహలోకి వచ్చి కళ్ళు తెరవడంతో, అది గమనించిన నిందితులు ఆమె ముక్కు మరియు నోరు చాలాసేపు మూసి ఉంచారట. దానితో కొన్ని క్షణాల్లోనే ఊపిరాడక ప్రియాంక చనిపోయినట్లు తెలుస్తోంది. 

 

అనంతరం ఎవరికీ కనపడకుండా ప్రియాంక మృతదేహాన్ని లారీలో ఎక్కించిన నిందితులు, లారీ క్యాబిన్ లో కూడా మరొక్కసారి అత్యాచారానికి పాల్పడ్డట్లు సమాచారం. కొన్ని గంటలు గడిచిన తరువాత అర్ధరాత్రి సమయానికి కొంత దూరం తీసుకెళ్లి ఆమె మృతదేహాన్ని దుప్పటికప్పి, ఆపై పెట్రోల్ మరియు డీజిల్ పోసి నిప్పంటించారని, అలానే ఆ మృతదేహం పూర్తిగా కాలేవరకు అక్కడే ఉండి, కాసేపటి తరువాత ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారని తెలుస్తోంది. నిజంగా ఇదంతా విన్న ఎవరికైనా హృదయం చలించిపోక మానదు. కేవలం క్షణిక సుఖం కోసం ఒక యువతిని అంత కిరాతకంగా హింసించి చంపిన ఆ నీచులను ఏమి చేసినా తక్కువే అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.......!!   

మరింత సమాచారం తెలుసుకోండి: