ఏవోబీలో పోలీసులు మావోయిస్టుల పీఎల్జీఏ వారోత్సవాల ప్రారంభించడంతో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. అవుట్ పోస్టుల ప్రాంతాల్లో అప్రమత్తమయ్యారు. మావోయిస్టులు పీఎల్జీఏ వారోత్సవాల నిర్వహణకు ఈ సోమవారం నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు.రెండు నెలల కిందట జరిగిన ఎన్కౌంటర్లలో ఐదుగురు మావోయిస్టులు జీకే వీధి మండలం మాదిగమల్లు అటవీ ప్రాంతంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దింతో మావోయిస్టులు వారోత్సవాలు జరుగుతుండడంతో ప్రతీకార దాడులు జరిపే అవకాశం ఉందని సమాచారం.
దీంతో మారుమూ ల గ్రామాల ప్రజలు భయం తో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు . అయితే పోలీసు యంత్రాంగం పీఎల్జీఏ వారోత్సవాలను భగ్నం చేసేందుకు సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల పోలీసు బలగాలు కూంబింగ్లో నిమగ్నమయ్యాయి. విశాఖ రూరల్ ఎస్పీ అట్టాడ బాబూజీ, ఒడిశాలోని మల్కన్గిరి,కోరాపుట్ జిల్లాలో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఎప్పటికప్పుడు అన్ని చర్యలుతీసుకుంటూ వాటిని సమీక్షచేస్తున్నారు.
విశాఖ జిల్లాకు చెందిన పోలీసు పార్టీలు ,ఒడిశా పోలీసు బలగాలు ఉమ్మడిగా ఏవోబీలో కూంబింగ్ చర్యలు చేపట్టాయి. కొయ్యూరు,సీలేరు,జీ,కే.వీధి,చింతపల్లి,అన్నవరం,జి.మాడుగుల,పెదబయలు ఇవన్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కనుక పోలీసు స్టేషన్ల పరిధిలో అదనపు పోలీసు బలగాలను అందుబాటులో ఉంచారు. ఆంధ్రా,ఒడిశా పోలీస్ అధికారులు మావోయిస్టుల పీఎల్జీఏ వారోత్సవాలను భగ్నం చేసేందుకు పకడగ్బందీగా వ్యూహం రచించినట్టు సమాచారం.
అనంతగిరి,అరకు,డుంబ్రిగుడ,హుకుంపేట,పోలీసుస్టేషన్లలో వున్నా పెద్ద అధికారులు,ప్రత్యేక పార్టీల పోలీసులు అప్రమత్తమయ్యారు. అంతేయ్ కాకుండా రెడ్ అలర్ట్ను రాళ్లగెడ్డ,కోరుకొండ,నుర్మతి, రూడకోట అవుట్ పోస్టులలో ప్రకటించారు. మావోయిస్టు పార్టీ వారోత్సవాలతో ఏవోబీ అంతా పోలీసు నిఘా అధికమైంది.అన్ని మండల కేంద్రాలు,ప్రధాన రోడ్లలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ప్రయాణుకుల లగేజీ బ్యాగ్లను సోదా చేస్తున్నారు. కల్వర్టులు,రోడ్డు ఇరువైపులా బాంబు స్క్వాడ్తో తనిఖీలు జరుపుతున్నారు. మావోయిస్టుల హిట్లిస్ట్లో ఉన్న ప్రజా ప్రతినిధులకు నోటీసులు జారీ చేసి మైదాన ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. సీలేరు మీదుగా అంతర్రాష్ట్రాలకు వెళ్లే రాత్రి సర్వీసులను నిలిపివేయనున్నారు. సీలేరు ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు పనులకు సంబంధించిన వాహనాలను పోలీసు స్టేషన్ల వద్దకు తరలించారు.