టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'రాంగ్ టైం లో' అతని ‘అల.. వైకుంఠపురములో' సినిమాలోని పాటని గురించి ట్వీట్ చేశాడు. దీంతో..'యావత్ భారతదేశం దిశ జస్టిస్ కోసం గళమెత్తుతంటే అల్లు అర్జున్ మాత్రం తన సినిమా లోని పాట గురించి మాట్లాడుతున్నాడు' అంటూ సామజిక మాధ్యమాలలో నెటిజన్లు ఇతన్ని తిట్టిపోస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన దారుణమైన ఘటనపై ఇప్పటికే అటు టాలీవుడ్, బాలీవుడ్, క్రికెటర్స్ ఇంకా చాలా మంది ప్రముఖులు స్పందిస్తూ దోషులను తక్షణమే ఉరి తీయాలని కోరారు. కానీ మన తెలుగు అమ్మాయి చనిపోతే.. తెలుగు హీరో అయిన అల్లు అర్జున్ మాత్రం దిశ ఘటనపై ఏమి స్పందిచకపోయేసరికి నెటిజన్లు బాగా తిడుతున్నారు. 

 

ఇంతకీ... అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ఏంటంటే.."సామజవరగమన ! వేగంగా చూడబడిన & లైక్ చేయబడిన సాంగ్.. మీరు చూపించే ప్రేమకు మీ అందరికి నా ధన్యవాదములు #సామజవరగమన #అల.. వైకుంఠపురములో." అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

 

ఇక అది చదివిన నెటిజన్లు ఇలా కామెంట్ చేస్తున్నారు... “స్టేట్ మొత్తం ఆడపిల్లల రేప్ ఇష్యూ మీద బాధపడుతుంటే వీడు ఈ టైమ్ లో ప్రమోషన్ చేసుకుంటున్నాడు.” అంటూ ఒక యూసర్ అన్నాడు.

 

"మీ అభిమానులంతా సినిమాల గురించి వదిలేసి.. ఇప్పుడు ఉన్న పరిస్థితిపై స్పందిస్తున్నారు. కానీ నువ్వేమో నీ సినిమా గురించి సెలెబ్రేట్ చేసుకుంటున్నావు. ఇక్కడ హీరో ఎవరో... అభిమాని ఎవరో నాకు అర్ధం అవట్లేదు' అంటూ ఇంకో యూసర్ ట్వీట్ చేశాడు. 

 

 

అల్లు అర్జున్ విషయం పక్కన పెడితే... మహేష్ బాబు మంచి పంక్తులతో ఒక వీడియోని విడుదల చేసి మగవాళ్లకు వారి బాధ్యతలను గుర్తు చేసి 'శబాష్' అనిపించుకున్నాడు. చిరంజీవి.. అర్జున్ రెడ్డి స్టార్.. విజయ్ దేవరకొండ కూడా దిశ ఘటనపై స్పందిస్తూ.. దోషులపై కఠిన శిక్ష వేయాలంటూ కోరారు. కానీ.. రాంగ్ టైమింగ్ లో ట్వీట్ చేయడంతో అల్లు అర్జున్ కు మాత్రం చివాట్లు తప్పట్లేదు. అనసూయ కూడా దిశ ఘటనపై స్పందించకుండా ఎక్సపోసింగ్ చేస్తుదంటూ ఆమెని ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: