మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై అత్యాచారాలు మాత్రం తగ్గటం లేదు. ఎక్కడికి వెళ్లిన మహిళపై దాడి జరుగుతూనే ఉంది. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు పశువుల్లా ఆడవాళ్ల మీద పడి పోతున్నారు. రోజుకొక అత్యాచార ఘటన తెరమీదికి వస్తూనే ఉంది. అత్యాచార ఘటన తెరమీదికి రాగానే నాలుగు రోజులు నిరసన తెలుపడం ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం కామన్ అయిపోయింది అయితే నిందితులకు కఠిన శిక్షలు పడాలి అని నిరసన తెలిపినప్పటికీ నిందితులు మాత్రం సరైన శిక్షలు పడడం లేదు.
నెలలు నిండని పసికందుల నుంచి పండు ముసలి వరకు అందరిపై మృగాల్లాంటి మగాళ్లు మీద పడి అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తూనే ఉన్నాయి. అటు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకున్నప్పటికీ కామాంధుల బారినుండి మహిళలు మాత్రం కాపాడుకోలేక పోతున్నారు. మహిళలకు ఎక్కడ రక్షణ లేకుండా అయిపొయింది . రోడ్డు మీద నడిస్తే ఆకతాయిలు నుంచి చదువుకోవడానికి వెళ్తే గురువుల నుంచి ఇంట్లోకి వస్తే సొంత వారినుంచి ఇలా ప్రతి చోట మహిళలపై లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. తాజాగా మరో ఘటన తెరమీదికి వచ్చింది. ఆరోగ్యం బాగాలేక డాక్టర్ దగ్గరికి వెళ్తే... పేషెంట్ కు ఆరోగ్యాన్ని బాగు చేయాల్సిన డాక్టర్ కాస్త కామం చూపుతో చూసి ఆ మహిళపై లైంగిక దాడికి యత్నించాడు.
కడుపు నొప్పి అని వెళ్లిన యువతిపై వైద్యుడు లైంగిక దాడి యత్నించిన ఘటన పాటియాలలో చోటు చేసుకుంది. రాజపుర ప్రాంతానికి చెందిన 32 మహిళా తన భర్తతో కలిసి నివాసముంటుంది. అయితే వీరికి ఇద్దరు సంతానం.అయితే గత వారం కడుపు నొప్పితో బాధ పడిన ఈ మహిళ స్థానికంగా ఓ వైద్యుడి వద్దకు వెళ్ళింది. క్లినిక్ లో ఎక్కువగా స్టాఫ్ లేకపోవడంతో... కడుపునొప్పి నిమిత్తం హాస్పిటల్ కి వచ్చిన ఆ మహిళను చికిత్స నిమిత్తం గదిలోకి తీసుకెళ్లాడు ఆ వైద్యుడు. అనంతరం కామంతో కళ్లు మూసుకుపోయి ఆ మహిళపై లైంగికదాడికి యత్నించాడు ఆ కర్కశ వైద్యుడు. దీంతో బాధిత మహిళల పెద్ద ఎత్తున ప్రతిఘటించి అక్కడినుంచి తప్పించుకుని బయటకు వచ్చి గగ్గోలు పెట్టింది. దీంతో చుట్టుపక్కల వాళ్ళు ఆ వైద్యుడికి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించగాఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని అతనిని అదుపులోకి తీసుకున్నారు.