మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.  ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై అత్యాచారాలు మాత్రం తగ్గటం లేదు.  ఎక్కడికి వెళ్లిన మహిళపై దాడి జరుగుతూనే ఉంది. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు  పశువుల్లా ఆడవాళ్ల మీద పడి పోతున్నారు. రోజుకొక అత్యాచార ఘటన తెరమీదికి వస్తూనే ఉంది. అత్యాచార ఘటన తెరమీదికి రాగానే నాలుగు రోజులు నిరసన తెలుపడం ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం కామన్ అయిపోయింది అయితే నిందితులకు కఠిన శిక్షలు పడాలి అని నిరసన తెలిపినప్పటికీ నిందితులు మాత్రం సరైన శిక్షలు పడడం లేదు. నెలలు నిండని పసికందుల నుంచి పండు ముసలి వరకు అందరిపై మృగాల్లాంటి  మగాళ్లు మీద పడి  అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తూనే ఉన్నాయి. 

 

 

 

 తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి తెరమీదికి వచ్చింది స్నేహం ప్రేమ ముసుగులో యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఓ వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో కలిసి  గ్యాంగ్ రేప్ కు  పాల్పడిన ఘటన ఛత్తీస్ ఘడ్  బిలాస్ పూర్ లో చోటుచేసుకుంది. రాయపూర్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో బాధితురాలు ఉద్యోగం చేస్తూ ఉంటుంది. అయితే అదే కంపెనీలో పనిచేసే ఓ యువకుడు ఆ యువతిపై కన్నేసి ప్రేమ పేరుతో వల విసిరాడు. అయితే గత కొంత కాలం తర్వాత ఆ యువకుడు ఆ కంపెనీ ఉద్యోగం మానేసి వెళ్లిపోయాడు. అయినప్పటికీ బాధిత యువతి తో  ప్రేమ పేరుతో కాంటాక్ట్ చేస్తూనే ఉండేవాడు ఆ యువకుడు. ఈ క్రమంలోనే గత వారం ఓ  రోజు సినిమా కి వెళ్దాము అంటూ యువతిని కోరాడు. అయితే మొదట ఆ యువతి సినిమాకు వెళ్లడానికి ససేమిరా అన్నప్పటికీ ఆ తర్వాత ఆ యువకుడు మాయ మాటలు చెప్పడంతో సినిమాకు వెళ్లేందుకు ఒప్పుకుంది. 

 

 

 

 దీంతో ఇద్దరు కలిసి ద్విచక్ర  వాహనంపై సినిమాకు వెళ్లారు కూడా. అయితే సినిమా చూసిన అనంతరం ఇంటికి వెళ్తుండగా... ద్విచక్ర వాహనాన్ని ఓ నిర్మాణ ప్రదేశం లోకి తీసుకెళ్లి ఆపాడు ఆ యువకుడు . అక్కడే ఆ యువకుడి ఇద్దరు స్నేహితులు ఆ నిర్మానుష్య ప్రదేశంలో  కాపుకాసి ఉన్నారు . అయితే ఇదంతా పథకం ప్రకారమే చేసారు అని అర్థం చేసుకున్న యువతి వారి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ముగ్గురు కలిసి ఆ యువతిపై లైంగిక దాడి చేశారు. అనంతరం ఆమెను గాయపరచి సమీపంలోని ఓ కాళీ బంగ్లా వద్ద వదిలేసి వెళ్లిపోయారు. అయితే ఆ బాధిత యువతి ని గుర్తించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ యువతి జరిగిన సంఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: