ఈ మధ్యకాలంలో నిరుద్యోగులకు శుభవార్త మీద శుభవార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగాలు కేంద్రం ఉద్యోగాలు ఇలా ఎక్కడ పడితే అక్కడ నోటిఫికేషన్ పడి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతుంది. అయితే ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వగా ఈ నేపథ్యంలోనే సదరన్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. 

 

వివరాల్లోకి వెళ్తే... చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సదరన్ రైల్వే స్కిల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా.. భారీ సంఖ్యలో వివిధ వర్క్‌షాప్‌లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు ఈ పోస్టుల దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

 

సరైన అర్హతలు ఉన్నవారు డిసెంబరు 1 నుండి 31 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ చదివి తెలుసుకోండి. అప్రెంటిస్ పోస్టులు మొత్తం 3,585 ఖాళీలు ఉన్నాయి. అయితే ఇందులో క్యారేజ్ వర్క్స్ పోస్టులు 1208, సెంట్రల్ వర్క్‌షాప్ 723 పోస్టులు, సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ వర్క్‌షాప్లో 1654 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 

 

కాగా ఈ పోస్టులకు విద్య అర్హత 10+2 విధానంలో పదోతరగతి విద్యార్హత ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో ఐటీఐ ఉండాలి. ఎంఎల్‌టీ పోస్టులకు ఇంటర్ (బైపీసీ) ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయిలు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

 

కాగా ఈ పోస్టులకు వయోపరిమితి 15 నుండి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంఎల్‌టీ పోస్టులకు 24 సంవత్సరాల వరకు అవకాశం ఉంటుంది. కాగా ఈ పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 1 న ప్రారంభం కానుంది. కాగా ఈ పోస్టులకు దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 31వ తేదీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: