ప్రియాంకను అత్యంత పాశవికంగా తోడేళ్ళకంటే దారుణంగా చంపిన మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసుడు. ఈ వెధవ సంఘటన జరిగినరోజు రాత్రి వాడి ఇంటికెళ్లి ఏం చేసాడో తెలుసా. కన్నవారిని కూడా తన మోసపూరిత మాటలతో మోసపుచ్చాడు. అది ఎంత నమ్మకంగా అంటే అతని నటనను చూసిన వారు దిమ్మతిరిగి పడిపోవలసిందేనట. నిజం నిప్పులాంటిది అది ఎప్పటికైనా బయటకు వస్తుందని తెలియదేమో వీడికి.  ప్రియాంకను ఆరిఫ్ హత్యాచారం చేసిన ఆ రాత్రి  ఇటుకల లోడ్ దింపి మహబూబ్ నగర్ జిల్లా జాక్లూర్ గ్రామంలోని తన సొంత ఇంటికి చేరుకున్నాడు.

 

 

ఆ రాత్రి అతని తల్లి మొలాన్బీ అతను టెన్షన్ పడడం చూసి ఏదో అనుమానం వచ్చిన దానిలా ఏమైందని అడిగింది. ఏం జరుగలేదని అందరూ నిద్రపోండని ఆరిఫ్ అన్నప్పటికీ,  అతని తల్లి మరో మారు దబాయించి అడగడంతో, తాను ఒక మహిళను చంపానని ఒప్పుకున్నాడు. కాకపోతే ఇలా రేప్ చేసి చంపానని చెప్పకుండా లారీ ఆక్సిడెంట్ లో ఈ ఘోరం జరిగిందని. తాను లారీ నడుపుతుండగా ఎదురుగా ఒక జంట బైక్ మీద వచ్చిందని, లారీ కంట్రోల్ కాక వారిని గుద్దేయగా, ఆ ఘటనలో బైక్ వెనక కూర్చున్న మహిళా అక్కడికక్కడే మరణించినట్టు కవరింగ్ ఇచ్చి నేను అలసిపోయాను అందరూ పడుకోండి అని చెప్పడంతో అంతా పడుకున్నారు.

 

 

ఆ తరువాత పోలీసులు రావడం అతగాడిని పట్టుకెళ్ళడం  జరిగిపోయాయి. ఇకపోతే తన కొడుకు చేసిన దుర్మార్గమైన దారుణం గురించి అతని తల్లి తెలుసుకోవడానికి కానీ, ఆ విషయమై స్పందించడానికి కూడా ఇష్టపడడం లేదు. ఇక గతంలో లారీ డ్రైవర్ గా పని చేసిన అతని తండ్రి లారీ నుండి కింద పడడంతో పనికి వెళ్లలేకపోతున్నాడు. అంతే కాకుండా ఆరిఫ్ తల్లికి కూడా మొన్ననే ఆపరేషన్ జరగడంతో ఆమె కూడా ఏ పని చేయలేని పరిస్దితిలో ఉంది.

 

 

ఇక ఈ దుష్టుడు చేసిన అతి నీచమైన దారుణం వల్ల ఒక యువతి ప్రాణం కోల్పోవడమే కాకుండా వేరే ఆధారం లేని వీడి కుటుంబాన్ని కూడా రోడ్డున పడేసాడు. ఇక వీన్ని చంపేస్తే ఆ కుంటుంబానికి దిక్కు కూడా ఉండదు. ఇంత పెద్దవాన్ని చేసి కుటుంబానికి ఆసరా ఉంటాడనుకున్న కొడుకు నీచపు పని చేసి చావుకు దగ్గరగా ఉంటే ఆ కన్నపేగు ఎంత కఠినంగా మారిన ఎక్కడో ఒక్కచోట తెలియని బాధ మిగిలే ఉంటుంది. ఇప్పుడు వారి కుటుంబానికి ఆధారం ఏమి మిగలదు. నిజంగా ఆఘటన ప్రతి వారికి కనువిప్పు కలిగిస్తే చాలు..

మరింత సమాచారం తెలుసుకోండి: