జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వీరాభిమాని ఫుల్లుగా ఫైర్ అయ్యారు. రాష్ట్రమంత్రి అనీల్ కుమార్ యాదవ్ జనసేన అధినేతకు వీరాభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని ఆయనే ఎన్నోసార్లు చెప్పుకున్నారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఎంతటి మద్దుతుదారులో సినిమాల్లో పవన్ కు అంతే అభిమానిని అంటూ చాలాసార్లు చెప్పారు.

 

అలాంటి వీరాభిమానే ఇపుడు పవన్ పై తిరగబడ్డారు. అంటే ఇపుడు అనీల్ జగన్ మంత్రివర్గంలో కీలకశాఖను నిర్వహిస్తున్నారనుకోండి అది వేరే సంగతి. మంత్రి అయిన ఈ ఆరుమాసాల్లో ఒక్కసారి కూడా అనీల్ జనసేన అధినేతపై మాట్లాడలేదు. అదే సమయంలో జగన్ పై పవన్ ఎలా మాట్లాడుతున్నారో అందరికీ తెలిసిందే. తాజాగా రాయలసీమ పర్యటల్లో కూడా చంద్రబాబునాయుడుకు మద్దతుగా జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు.

 

దాంతో పవన్ పై అనీల్ ఫుల్లుగా ఫైర్ అయిపోయారు. పవన్ హచ్ కుక్కను మించిపోయినట్లు వ్యంగ్యంగా చిత్రీకరించారు. చంద్రబాబును గుడ్డిగా ఫాలో అవుతున్న కారణంగానే హచ్ కుక్కతో పోల్చినట్లు చెప్పారు. పవన్ ను రాజకీయనేత అనాలో లేకపోతే సినిమా నటుడు అనాలో కూడా అర్ధం కావటం లేదు. రాజకీయాలు తెలియవు కాబట్టి రాజకీయనేతగా చెప్పలేమని, అదే సమయంలో సినిమాల్లో లేరు కాబట్టి సినీనటుడు అని కూడా అనలేమన్నారు.

 

ముఖ్యమంత్రిని పవన్  జగన్ రెడ్డి అన్నా జగన్మోహన్ రెడ్డి అన్నా తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ఎందుకంటే పవన్ ను తాము పట్టించుకోవటం లేదని స్పష్టంగా చెప్పారు. గుడ్డిగా చంద్రబాబును ఫాలో అవ్వటం మానేసి ప్రతిరోజు దినపత్రికలు చదవటం మొదలుపెడితే మంచిదంటు పవన్ కు మంత్రి చురకలు వేశారు.

 

కడపలో స్టీలో ప్లాంటును ఎప్పుడు తెస్తారని అడుగుతున్న పవన్ నిజంగా అజ్ఞాతవాసే అంటూ అనీల్ మండిపోయారు. మొత్తానికి పవన్ కు ఎంతటి వీరాభిమానిగా చెప్పుకున్నా చంద్రబాబు కోసమని జగన్ ను వ్యతిరేకించటాన్ని తట్టుకోలేకపోయారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: