నిర్లక్ష్యం నిండుప్రాణాలను బలి తీసుకుంటున్న మనుషులకు జ్ఞానం కలగడం లేదు. మద్యం తాగి వాహనాలను నడపడం. లేదా అతివేగం, అనవసరమైన టెన్షన్స్తో రోడ్డెక్కి పక్కవాడి ప్రాణాలు ప్రమాదంలో పడేయడం తరచుగా జరుగుతున్న సంఘటనలు. ఇకపోతే మంగళవారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
చివ్వేంల మండలం గుంపుల దగ్గర అదుపుతప్పిన కారు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులను వైద్యం కోసం సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇక ప్రమాదానికి కారణం మద్యం సేనించి, అతివేగంగా డ్రైవింగ్ చేయడమేనని అనుమానిస్తున్నారు. ఇకపోతే మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించిన పోలీసులు.. వారి వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక గత నెలలో పాఠశాల విద్యార్థులు విహారయాత్రకు వెళ్లి తిరిగొస్తుండగా దీనికి సమీపంలోనే ఓ ప్రమాదం చోటుచేసుకుంది.
నల్లగొండ జిల్లా పుల్లెం జడ్పీ హైస్కూల్కు చెందిన విద్యార్ధులు వంబరు 10న విహారయాత్రలో భాగంగా ద్వారక తిరుమల, అన్నవరం, సింహచలం, వైజాగ్, అరకు తదితర ప్రాంతాల అనంతరం భద్రాచలం వెళ్లారు. అక్కడ నుంచి నవంబరు 11న రాత్రి పుల్లెంలకు తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చివ్వెంల సమీపంలోకి రాగాను ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో విద్యార్థులతో పాటు పలువురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికైన హైవేల వెంబడి మరింతగా ప్రమాదాలు చోటు చేసుకోకుండా రక్షణ చర్యలు కట్టుదిట్టంగా చేపట్తవలసిన అవసరం ఉందని ఇక్కడి ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు..