పెళ్లి చేసుకోవాలని అనుకునే వారు పెళ్ళికి ముందు ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడానికి సరదాగా ట్రిప్ కి వెళ్తారు. లేదంటే తమకి జీవితాంతం గుర్తుండిపోయేలా ఏదైనా ఒక పనిచేస్తారు. ట్రెక్కింగ్, లేదంటే ఫోటో షూట్ కి వెళ్ళడం ఇలా ఎదో క్రేజీ గా ఉండే విషయాలవైపుగా అడుగులు వేస్తారు. అచ్చం ఇలాగే ఓ కేరళా జంట కూడా ప్రయత్నించింది. తమ పెళ్ళికి  ముందు ఫొటో షూట్ కి వెళ్ళింది. అందరిలా ఉంటే కుదరదు కొంచం డిఫరెంట్ గా ఉండాలంటూ ఫోటో గ్రాఫర్ బిను సీన్స్ కి తెలిపారు. అంతే...

 

తమ జీవితాంతం గుర్తుండిపోయేలా అద్భుతమైన ఫోటోలని వారికి అందించింది. ఇప్పుడు ఈ ఫోటోలు ఇంటర్నట్ ని షేక్ చేస్తున్నాయి. ఏదైనా కొత్తగా ఫోటోలని తీయాలని అనుకున్నబిను బురదలో ప్రేమ ఎలా ఉంటుందో అనుకుంటూ ఆలోచన చేసింది ఆ ఇద్దరి జంటకి కొన్ని తర్ఫీడులు ఇస్తూ పొలాల మధ్యకి తీసుకు వెళ్లి అక్కడ పంటల్లో బురదలో కూర్చోపెట్టి ఫోజులు ఇవ్వమని చెప్పింది..

 

మొదట్లో ఆ కేరళ జంట మాకు ఇది నచ్చలేదు వద్దని చెప్పినా ఆమె వినలేదు వారిని ఒప్పించి మరీ ఆ బురదలో ఫోటో షూట్ ఏర్పాటు చేసింది. ఆ ఫోటోలని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. దాంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. నెటిజన్ల నుంచీ ప్రసంసలు అందుకుంటున్నారు ఈ జంట. మరి మీరు ఓ లుక్కేయండి...

మరింత సమాచారం తెలుసుకోండి: