దేశం మొత్తం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మాట దిశ హత్య, అత్యాచారం గురించే.  ఎక్కడ చూసినా ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు.  ఎవరిని కదిలించినా ఆమె గురించే చర్చిస్తున్నారు.  ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఆమె గురించే చూపిస్తున్నారు.  నలుగురు నిందితులు ఘోరంగా ఆమెను అత్యాచారం చేసి, హత్య చేశారు. ఇది చాలా దారుణమైన విషయం.  దారుణంగా హింసించి చంపేశారు.  కనీసం ఆమె కుటుంబ సభ్యులకు కడసారి చూపులు కూడా మిగల్చకుండా దారుణంగా కాల్చివేశారు.  


నిందితులను పోలీసులు ఇప్పటికే పట్టుకున్నారు.  పట్టుకొని జైలులో పెట్టారు.  ప్రస్తుతం నలుగురు నిందితులు రిమాండ్ లో ఉన్నారు.  వారినుంచి ఇంకా కొంత విలువైన సమాచారం సేకరించాల్సి ఉన్నది.  అందుకే వారిని తమ కష్టడికి అప్పగించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.  ఈరోజు ఆ పిటిషన్ పై నిర్ణయం తీసుకుంటుంది కోర్టు.  ఇక ఇదిలా ఉంటె, దిశకు చిన్నప్పటి నుంచి జంతువులు అంటే చాలా ఇష్టం అని, మెడిసిన్ లో సీటు వచ్చినా మూగజీవాలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే వెటర్నరీ డాక్టర్ గా చేరిందని, మూగ జీవాలకు సేవచేయడం అంటే ఆమెకు చాలా ఇస్తాం అని అంటున్నారు ఆమె మామయ్య పేర్కొన్నారు.

 
దిశకు పుస్తకాలు చదవడం, కొత్త కొత్త వంటలు చేయడం, మూగజీవాలకు సేవ చేయడం వంటివి అంటే చాలా ఇష్టం అని, మెడిసిన్ లో సీటు వస్తే.. జాయిన్ అవ్వమని అన్నా, ఆమె అందులో జాయిన్ కాలేదని, మూగ జీవాలకు సేవచేయాలనే లక్ష్యంతో వెటర్నరీ డాక్టర్ జాయిన్ అయ్యిందని ఆమె మామయ్య అంటున్నారు.  తన పని తాను చేసుకుంటూ పోవడం తప్పించి మరో వ్యాపకం తెలియని దిశను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం విషాదమని అన్నారు.  


తమ ఆచారం ప్రచారం ఎవరైనా సరే వివాహం కాకముందు మరణిస్తే... దహనసంస్కారాలు చేసే ముందు చెట్టుతో వివాహం చేయిస్తారని అన్నారు.  కానీ, దిశ విషయంలో ఆ సంస్కారం జరిపించలేకపోయామని అయన అన్నారు.  ఇలాంటి దుస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదని, నిందితులను కఠినంగా శిక్షించాలని అప్పుడే దిశ ఆత్మకు శాంతి చేకూరుతుందని, మా కుటుంబం మొత్తం కోరుకునేది అదే అని అయన అన్నారు.  మరి చట్టాలు ఆ నలుగురు నిందితులను ఎలా శిక్షిస్తాయో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: