జగన్ పై వైసీపీ ప్రభుత్వం పై ఎవరైనా విమర్శలు చేస్తే వారికి గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటారు వైసీపీ పార్లమెంటరీ సభ్యులు విజయసాయిరెడ్డి. తనదైన శైలిలో ఘాటైన విమర్శలు చేస్తూ... ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇస్తూ ఉంటారు. జగన్ ప్రభుత్వం పై విమర్శించే ప్రతి ఒక్కరిపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు వైసీపీ పార్లమెంటరీ సభ్యులు విజయసాయిరెడ్డి. మరోసారి తనదైన శైలిలో కామెంట్ చేశాడు విజయసాయిరెడ్డి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తు  తీవ్ర విమర్శలు చేశారు. గత కొంతకాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్ ను  టార్గెట్ చేస్తూ పలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. 

 

 

 

 జగన్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి విషయాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైనప్పటికే ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు కంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు పవన్ . మొన్నటి వరకు ఇసుక  సమస్య విషయంలో తీవ్ర ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్ తాజాగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టిన అంశంపై ఎన్నో విమర్శలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ విమర్శలపై ఇప్పటికే చాలాసార్లు స్పందించిన వైసీపీ పార్లమెంటరీ సభ్యులు విజయసాయిరెడ్డి ఎన్నో ఘాటైన విమర్శలు చేశారు. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు విజయసాయిరెడ్డి.

 

 

 

 ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైనప్పటికి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిగ్గుపడకుండా దులిపేసుకున్నారు అని విజయసాయి రెడ్డి విమర్శించారు. జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయారు అంటూ ఆరోపించారు విజయసాయిరెడ్డి. 2019 ఎలక్షన్లలో  ప్రజలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రజలు బోర్లించి కొట్టినంత పని చేసినప్పటికీ సిగ్గులేకుండా అన్ని దులిపేసుకున్నారు అని... యాక్టర్ ను  చూద్దామని నలుగురు పోగానే రెచ్చిపోయి మరీ డైలాగులు వదులుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు విజయ్ సాయి రెడ్డి. రాజకీయాలంటే ప్యాకేజీ కోసం అమ్ముడుపోవడం కాదని... ఎవరో ఉస్కో అంటే కాసేపు మొరిగి  వెళ్లిపోవడం అంతకంటే కాదు అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్  వేదికగా విమర్శలు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: