సమాజంలో రోజురోజుకు అక్రమ సంబంధాలు ఎక్కువవుతున్నాయి. భర్త ఉండగానే పరాయి మగాడితో అక్రమ సంబంధాలు పెట్టుకున్న మహిళలతో పాటు... కట్టుకున్న భార్య ఉండగానే తన భార్యను నిర్లక్ష్యం చేస్తున్న భర్తలు ఎక్కువవుతున్నారు. అక్ర‌మ సంబంధాల వ‌ల్ల ఎన్ని జీవితాలు విచ్ఛిన్న మ‌వుతున్నా... దీనిపై ప్ర‌జ‌ల్లో మాత్రం ఎలాంటి మార్పులు రావ‌డం లేదు. ఎవ‌రికి వారు ఈ సంబంధాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. 

 

తాజాగా అనంతపురం జిల్లాలో ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తనను చంపాలని చూస్తున్నారు అంటూ ఓ మహిళ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమం లో ఫిర్యాదు చేయడం సంచలనం గా మారింది. అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకవర్గం లోని నంబుల పూల‌కుంట‌కు చెందిన ఓ మహిళకు కదిరి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తో కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 

 

అయితే తన భర్తకు కొద్దినెలల క్రితం ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే యువతితో పరిచయమై అక్రమ సంబంధానికి దారితీసిందని ఆ బాధితురాలు ఆరోపిస్తోంది. త‌న భ‌ర్త‌తో పాటు ఆ యువ‌తి ఇద్ద‌రూ క‌లిసి త‌న‌ను చంపేసి వాళ్లిద్ద‌రు పెళ్లి చేసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు కూడా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన జీవితాన్ని నాశనం చేయొద్దని భర్తను ఎంత వేడుకున్నా కనికరించడం లేదని వాపోయింది. సదరు బాధితురాలు తన వైవాహిక జీవితం నిలబెట్టాలని ఎస్పీ స‌త్య ఏసుబాబును వేడుకోవడం తో ఆయన విచారణకు ఆదేశించారు. 

 

ఎస్సీ బాధితురాలికి స్వయంగా న్యాయం చేయాలని ఆదేశించారు. దీంతో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే కేసు నమోదు చేస్తామని...  జైలు శిక్ష అనుభవించక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. దీంతో సదరు భర్త తన భార్యను తీసుకొని వెళ్లడం విశేషం. మరోసారి అతడి వేధిస్తే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు బాధితురాలికి సూచించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: