జనాల మైండ్ సెట్ ఎంత వికృతంగా తయారైందో తెలిసిందుకు తాజాగా ఓ ఉదాహరణ నిలబడుతోంది. వెటర్నరీ డాక్టర్ దిశను రేప్ చేస్తే తప్పేముంది ? అంటూ ఓ నెటిజన్ సోషల్ మీడియాలో ప్రశ్నించారు. నిజామాబాద్ ఫకీరాబాద్ కు చెందిన శ్రీరామ్ అనే యువకుడు సోషల్ మీడియాలో దిశా హత్యాచారం పై ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెట్టారు. యువకుడు పెట్టిన పోస్టుపై వెంటనే నెటిజన్లు ఫుల్లుగా ఫైర్ అయిపోయారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

 

నెటిజన్ల ఫిర్యాదుతో నిజమాబాద్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సోషల్ మీడియాలో దొరికిన ఆధారాల సహాయంతో పోస్టు పెట్టిన యువకుడు నిజామాబాద్ కు చెందిన శ్రీరామ్ గా గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆరు రోజుల క్రితం శంషాబాద్ మండలంలో జరిగిన వెటర్నరీ డాక్టర్ హత్యాచారంపై యావత్ దేశం అట్టుడుకిపోతోంది. మహిళలు, యువత, చిన్న పిల్లలు, పెద్దలు ఇలా తేడాలు లేకుండా ప్రతి ఒక్కరు జరిగిన ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు.

 

ఇటువంటి నేపధ్యంలో తన చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూస్తు కూడా ఆ యువకుడు రేప్ చేస్తే తప్పేమిటి ? అని ప్రశ్నించాడంటే అతని మానసిక పరిస్ధితి ఎలాగుందో అర్ధం చేసుకోవచ్చు. అతను తన ఇంట్లో వాళ్ళతో మాట్లాడటమో లేకపోతే ఎక్కడో మిత్రులతో మాట్లాడితే ఏమోలే అనుకోవచ్చు. అలా కాకుండా తన అభిప్రాయాన్ని బహిరంగంగా సోషల్ మీడియాలోనే పంచుకున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దిశపై హత్యాచారం జరిగిన 48 గంటలు కూడా తిరక్కుండానే అదే ప్రాంతంలో మరో యువతిపై కూడా హత్యాచారం జరగటంతో అందరి మైండ్ బ్లాంక్ అయిపోయింది. దిశపై హత్యాచారం చేసిన నలుగురు నిందుతుల్లాంటి వాళ్ళే కాదు శ్రీరామ్ లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా ఉండటం వల్లే అత్యాచారాలు, హత్యాచారాలు జరుగుతునే ఉన్నాయి.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: