ఆర్టీసీ చార్జీల పెంపు ప్రభావం హైదరాబాద్‌పై భారీగానే పడనుంది. ప్రస్తుతం ఆర్టీసీకి వస్తున్న నష్టాల్లో సగం వాటా సిటీవే ఉంటున్నాయి. ఆ నష్టాలను వీలైనంత మేర తగ్గించేందుకు కసరత్తు మొదలైన తరుణంలో, చార్జీల పెంపు ఆర్టీసీకి బాగానే కలిసి రానుంది. కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచగా, శాతాల్లో అది 18.80 శాతంగా ఉండనుంది. కానీ సిటీ సర్వీసుల వరకు వచ్చేసరికి అది 23 శాతంగా ఉంటోంది.

 

 కిలోమీటర్ల లెక్క కాకుండా సిటీలో స్టాపుల ప్రాతిపదికగా ఛార్జీ ల పెంపు ఉంది. పైగా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బ స్సులకు రూ.5గా ఉన్న కనిష్ట ఛార్జీని రూ.20కి పెంచారు. నగరంలో ఉన్న బస్సుల్లో వీటి సం ఖ్యే ఎక్కువగా ఉండటం, ప్రయాణికుల సం ఖ్య కూడా వీటిల్లోనే ఎక్కువగా ఉంటుండటం తో ఈ మార్పు కూడా కలిసి రానుంది. ఎలాగైతేనేమి అన్ని కలసివెరసి.. తాజా రేట్ల సవరణతో సిటీ సర్వీసులకు సం బంధించి వార్షికంగా రూ.324 కోట్ల మేర ఆదా యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. 

సమ్మె ప్రారంభం కావటానికి ముందు నగరంలో టికె ట్‌ రూపంలో రోజువారీ ఆదాయం సగటున రూ.3.06 కోట్లుగా ఉంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు ఎక్కువగా ప్రత్యామ్నాయ వాహనాలను ఆశ్రయించడం జరిగినది.. ఇప్పుడు తిరిగి ఆర్టీసీబస్సులు తిరగడము మొ దలైనందున ప్రయాణికులంతా సిటీ బస్సుల్లోనే ఎక్కుతారని మనము ఆశిద్దాము. టికెట్ల పెంపుదల వల్ల ఈ ఆదాయం అలాగే ఉంటే టికెట్ల ధరల సవరణ వల్ల ప్రతినెల నెల ఆదాయం రూ.27 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 

 

ప్రస్తుతం నెలకు ఒక్క సిటీలో నే దాదాపురూ.45 కోట్ల మేర నష్టం వస్తోంది. దీనిని బట్టి ఎంతమంది సొంత వాహనాలు సమకూర్చుకుంటున్నారో అర్థమవుతున్నది తాజాగా సమకూరే అదనపు ఆదాయంతో ఆ నష్టం మొత్తాన్ని రూ.18 కోట్లకు కొంతవరకు తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ప్రజలు కూడా ప్రభుత్వ సొమ్ము మన సోమ్మె అని భావించి సొంత వాహనాలను ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా అందరూ రూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తే ఆర్టీసీ నష్టాన్ని కొంతవరకు తగ్గించడానికి ప్రజలు కూడా బాధ్యత వహించవలసి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: