నిన్న పవన్ కళ్యాణ్ కడప జిల్లాలో రైల్వే కోడూరు లో ప్రసంగిస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై చేసిన ఆరోపణలకు మంత్రి అనిల్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అసలు ఏం మాట్లాడుతున్నారో తనకే అర్ధం కాదంటూ విమర్శించారు. జ్ఞానం సముపార్జించుకోవాలి అని పవన్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ అజ్ఞాని అని అందరికీ తెలుసంటూ విమర్శించారు.

 

పవన్ కళ్యాణ్ ను ఏమని పిలవాలో అర్ధం కావట్లేదు ప్రతిపక్ష నేత అని పిలుద్దాం అంటే పోటీ చేసిన ఒక్క చోటా గెలవలేదు, పోనీ హీరో అని పిలుద్దామా అంటే పవన్ చేతిలో సినిమాలు లేవు. మేధావి అని పిలుద్దాం అంటే పవన్ అంత అజ్ఞాని ఇంకెవరు లేరు అని అందరికీ తెలుసంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి అనిల్ కుమార్. గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అని పిలిస్తున్నారు పవన్, అయినా ఈ రాష్ట్రంలో పవన్ ను పట్టించుకునే వారే లేరు ఎలా పిలిస్తే ఏంటి అని అనిల్ చెప్పారు.

 

2017 వ సంవత్సరాలో ఒక గిరిజన పాపకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నావు. 2017 లో జగన్ ముఖ్యమంత్రి కాదు అధి గుర్తులేదా మీకు, అయినా 2017 లో అన్యాయం జరిగితే ఇప్పటి వరకు పవన్ నిద్రపోయారా అని ప్రశ్నించారు అనిల్. తాట తీస్తా, తాటా తీస్తా అని పదే పదే అంటున్నారు, ఎవరి తాట తీస్తారు మీరు. కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి పవన్, తెలుగు మీడియం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం ఆపి ఫస్ట్ మీ పిల్లలు ఏ మీడియం లో చదువుతున్నారో చెప్పండి అని అనిల్ డిమాండ్ చేశారు.

 

 

ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అనడం ఆపి రేణుదేశాయ్ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం జగన్ పోరాడట్లేదు అంటున్నారు. కొంచెం పేపర్ చదవండి సార్, డిసెంబర్ 26 న కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తున్నాం అని అనిల్ పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు. ఇక అనిల్ కౌంటర్ కు పవన్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: