‘డాక్టర్ ప్రియాంక రెడ్డి హంతకులను బహిరంగంగా ఉరి తీయాలంటూ పెద్ద ఎత్తున మహిళా సం ఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ దారుణ హత్యపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి . జస్టిస్ అంటూ యావత్ భారతావని గొంతెత్తుతోంది. అయితే మన తెలుగు బిడ్డ చనిపోతే తెలుగు సెలబ్రిటీల గొంతు మాత్రం మూగబోతుంది..
ఈ తరుణంలో బుల్లితెరపై తన అంగాంగ ప్రదర్శనతో ఎక్స్పోజింగ్కు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిన యాంకర్ అనసూయ చేసిన పోస్ట్లు ప్రశ్నార్దకంగా మారాయి. ఎన్నో పనికిమాలిన విషయాలపై స్పందిస్తూ.. ఆ సినిమా అలా ఉండకూడదు.. ఈ సినిమా ఇలా ఉండకూడదు.. అర్జున్ రెడ్డిలో హీరోయిన్ని కొట్టడం ఏంటి? నా డ్రస్లు నా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటా? లాంటి సమాజానికి నిరుపయోగమైన కామెంట్స్తో సోషల్ మీడియాలో రెచ్చిపోయే అనసూయ.. హైదరాబాద్కి కూతవేటు దూరంలో మన తెలుగు బిడ్డ చనిపోతే.. స్పందించకపోగా.. ఆమె కొత్త షోకి సంబంధించి ప్రమోషన్స్ చేసుకుంటూ అంగాంగ ప్రదర్శనకు తెరతీయడంపై విమర్శతలెత్తుతున్నాయి.
ఒకవైపు ప్రపంచం మొత్తం ఈ దారుణమైన ఘటనపై స్పందిస్తూ ఉంటే.. నువ్ ఒక్కరోజు కూడా ఎక్స్ పోజింగ్ చేయకుండా ఉండలేకపోతున్నావా? దారుణ హత్యకు గురైన ఆ డాక్టర్కి, ఆ కుంటుబానికి సానుభూతి తెలిపావా? ఛీ అంటూ నెటిజన్లు అనసూయను తిట్టినతిట్టు తిట్టకుండా ట్రోల్ చేస్తున్నారు.అనసూయ.. నిన్ను చూసి సిగ్గుపడుతున్నాం. ఇండియా అంతా ఆ వెటర్నటీ డాక్టర్కు న్యాయం జరగాలని జస్టిస్ అంటూ నినదిస్తుంటే.. ఈరోజు కూడా నీ ఎక్స్ పోజింగ్ ఆపట్లేదు అని అనసూయను ఏకిపారేశాడు. అతనికి మద్దతు ప్రకటిస్తూ కరెక్ట్గా చెప్పావ్ అని మరికొంతమంది స్పందిస్తున్నారు.వెటర్నరీ డాక్టర్ దారుణ ఘటనపై మీ రియాక్షన్ ఇదేనా..
మన తెలుగు అమ్మాయి దారుణ హత్యకు గురైతే.. ఘటన జరిగి రెండు రోజులైన తరువాత కేవలం రీ ట్వీట్స్ చేసింది అనసూయ. దర్శకుడు బీవీఎస్ రవి, యాంకర్ సుమ చేసిన ట్వీట్స్ను రీట్వీట్ చేసి సరిపెట్టుకుంది. ఇక ఫేస్ బుక్, ఎన్ స్టాగ్రామ్ అయితే ఆమె అందాల ఆరబోతకే తప్ప.. ఎక్కడ ఈ సంఘటన గురించి మాట్లాడలేదు. .ఇదే ఇష్యూపై యాంకర్ రష్మి కూడా స్పందించకపోవడం శోచనీయం. కుక్కలు, మొక్కలు అంటూ సోషల్ ఇష్యూపై ఘాటుగా స్పందించే యాంకర్ రష్మి.. తోటి ఆడదాన్ని దారుణంగా రేప్ చేసి చంపేస్తే కూడా తన ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్లో స్పందించడానికి కూడా మనసు రాక అనసూయ బాటలోనే నడిచింది.