పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ముర్షిదాబాద్ జిల్లాలోని ఇస్లాంపూర్ లో జిన్నారుల్ షేక్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం సెర్జినా బీబీ అనే యువతిని ప్రేమించాడు. కానీ కొన్ని కారణాల వలన సెర్జినా బీబీతో జిన్నారుల్ షేక్ కు వివాహం జరగలేదు. జిన్నారుల్ షేక్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. జిన్నారుల్ షేక్ కు అతని భార్యకు ఒక బిడ్డ కూడా పుట్టాడు. 
 
కానీ పెళ్లైనా జిన్నారుల్ షేక్ సెర్జినా బీబీని మరిచిపోలేదు. సెర్జినా బీబీని ప్రేమించిన సమయంలోనే జిన్నారుల్ కు సెర్జినా బీబీకి లైంగిక సంబంధం ఏర్పడింది. జిన్నారుల్ షేక్ తనకు పెళ్లైన తరువాత కూడా సెర్జినా బీబీని పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక సంబంధం కొనసాగించాడు. సెర్జినా జిన్నారుల్ షేక్ ను మొదటి భార్యకు విడాకులు ఇచ్చి తనను వివాహం చేసుకోవాలని కోరింది. 
 
జిన్నారుల షేక్ సరేనని సెర్జినాకు చెప్పాడు. ఆ తరువాత విడాకులకు ధరఖాస్తు చేశానని త్వరలోనే విడాకులు మంజూరవుతాయని చెప్పి సెర్జినా బీబీని వివాహం చేసుకున్నాడు. సెర్జినాకు ఆ తరువాత జిన్నారుల్ షేక్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వటానికి ధరఖాస్తు చేశానని చెప్పి మోసం చేశాడని తెలిసింది. కొన్నిరోజుల పాటు వీరిద్దరి మధ్య ఈ విషయంలో గొడవలు కూడా జరిగాయి. 
 
అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన సెర్జీనా కొన్ని రోజుల తరువాత తన ధగ్గరకు రావాలని జిన్నారుల్ కు కబురు పంపింది. సంతోషంగా వచ్చిన జిన్నారుల్ పడుకున్న తరువాత సెర్జినా కత్తితో జిన్నారుల్ షేక్ పురుషాంగం కోసేసింది. ఆ తరువాత అక్కడినుండి సెర్జినా పరారైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జిన్నారుల్ షేక్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితురాలు సెర్జినా బీబీ కోసం గాలిస్తున్నారు. ఊహించని ఈ ఘటనతో సెర్జినా బీబీ కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: