ఒకవైపు దేశంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేస్తుంటే... తమ పిల్లలకు రక్షించుకోవడానికి తీసుకెళ్లి స్వామీజీల ఆశ్రమంలో ఉంచుతుంటే అక్కడ కూడా భగవంతుడి స్వరూపంగా ఉండే స్వామీజీలు కూడా వారిని హింసిస్తున్నారు.  కోరికలు తీర్చుకుంటున్నారు. ఎవరు దొంగ స్వాములో ఎవరు అసలు స్వామీజీలో తెలియడం లేదు.  ఇలా ఎందుకు చేస్తున్నారు అనే విషయం ఎవరికీ తెలియదు.  ఎక్కడ ఉన్నా మహిళలకు కనీసం భద్రత ఉండటం లేదు అన్నది వాస్తవం.

 
ఇప్పటికే ఒకసారి హీరోయిన్ రంజిత విషయంలో రంకు బయటపడ్డ నిత్యానంద స్వామి అభియోగాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.  అభియోగాలు ఎదుర్కొన్నా ఏదో విధంగా బయటపడ్డాడు.  బెంగళూరు నుంచి అహ్మదాబాద్ ఆశ్రమంలో ఉన్న నిత్యానంద స్వామీ, అక్కడ కూడా కొన్ని రాసలీలలు పాల్పడ్డాడని అభియోగాలు వచ్చాయి.  అంతేకాదు, బెంగళూరు ఆశ్రమంలో నుంచి కొంతమంది మహిళలను అహ్మదాబాద్ షిఫ్ట్ చేశారు.  


అక్కడికి షిఫ్ట్ చేసిన తరువాత ఆ మహిళల తల్లి దండ్రులకు కూడా విషయాలు తెలియడం లేదట.  దీంతో అహ్మదాబాద్ హైకోర్టులో మహిళల తల్లిదండ్రులు కోర్టులో కేసు దాఖలు చేశారు.  ఇలా కోర్టులో కేసు ఫైల్ అయిన తరువాత... స్వామిజీ మిస్ అయ్యారు.  ఎక్కడికి వెళ్లారు ఎవరికీ తెలియదు.  అయన కోసం పోలీసులు వెతుకుతున్న సమయంలో సడెన్ ఆయన వెస్ట్ ఇండీస్ దీవుల్లో ప్రత్యక్షం అయ్యారు.  


వెస్టిండీస్ లో ఉన్న తన సొంత ప్రైవేట్ దీవుల్లో నిత్యానంద స్వామి ప్రత్యక్షం అయ్యారు.  ప్రస్తుతం అక్కడే ఉన్నారట.  ఆ దీవికి కైలాస దీవి అనే పేరు పెట్టుకున్నారు.  సొంతంగా కొనుగోలు చేసిన ఆ దీవికి దేశం హోదా ఇవ్వాలని ఇప్పటికే అయన ఓ పిటిషన్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది.  అంతేకాదు, ఆ దీవికి వచ్చేందుకు ప్రత్యేకంగా ఓ పాస్ పోర్ట్ ను కూడా రూపొందిస్తున్నారట.  అంటే కైలాస దీవిని ఏకంగా దేశంగా మారుస్తున్నారన్నమాట.   

మరింత సమాచారం తెలుసుకోండి: