గత కొన్ని రోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని గతంలోనే పవన్ మంతనాలు జరిపారని, ఇప్పుడు మళ్ళీ విలీనం చేయడం కోసం అమిత్ షాని పొగుతున్నారేమో అన్నారు. జగన్...సోనియా గాంధీని ఎదిరించడం వల్ల జైలుకు వెళ్లాల్సి వచ్చిందని, మీలా మోడీ, అమిత్ షాలని పొగిడితే జైలుకు ఎందుకు వెళ్తారన్నారు. ఇక తమ మాటల వల్ల ‘దిశ’ లాంటి ఘటనలు జరిగితే పవన్ వల్ల ఇంకెన్ని జరగాలని మండిపడ్డారు.

 

ఇక చంద్రబాబుపై కూడా నాని విరుచుకుపడ్డారు. చంద్రబాబు రాజధాని పర్యటనలో చెప్పులు, రాళ్ళు విసిరింది రైతులే అని, రాజధాని పేరుతో కల్లబొల్లి మాటలు చెప్పి 33 వేల ఎకరాలు తీసుకుని మోసం చేశాడని, అందుకే రైతులు తిరగబడ్డారన్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం వైసీపీ రౌడీలు చేశారని ఓ గగ్గోలు పెట్టేస్తున్నారని, నిజనిజాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.

 

ఇక రాష్ట్ర గవర్నర్ ని కలిసి జగన్ ప్రభుత్వం, డి‌జి‌పిపై ఫిర్యాదు చేశామని టీడీపీ నేతలు సొల్లు కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. అసలు నిజంగా వైసీపీ దాడి చేయాలనుకుంటే బాబు జిల్లాల పర్యటనలోనే చేయలేమా ? అని ప్రశ్నించారు. అయితే చంద్రబాబు, పవన్ లు ...వారి దరిద్రపు మొహాలని టీవీలో కనపడకపోతే జనం మరిచిపోతారని, అందుకే ఇలా డ్రామాలు ఆడతారని అన్నారు.

 

ఎన్ని డ్రామాలు ఆడిన తమకొచ్చే నష్టమేమీ లేదన్నారు. పవన్ మూడు నెలలకొకసారి బయటకొచ్చి చంద్రబాబు తానా అంటే తందాన అంటారని చెప్పారు. ఇక చంద్రబాబు తనయుడు, మాజీ పప్పు మంత్రి లోకేశ్ అయితే ట్విట్టర్, ఫేస్ బుక్ లకే పరిమితమవుతారని ఎద్దేవా చేశారు. ఏదేమైనా కొద్ది రోజులుగా ప్ర‌తి రోజు మీడియా స‌మావేశాలు పెడుతూ ఏకేస్తోన్న  నాని త‌న విమ‌ర్శ‌ల ప‌రంప‌ర ఎప్ప‌టి వ‌ర‌కు కంటిన్యూ చేస్తాడో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: