రోజు రోజుకి మ‌హిళ‌ల పై అఘాయిత్యాలు ఎక్కువ‌వుతున్నాయి. ఈ త‌రుణంలో ఇటీవ‌లె దిశ వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే మ‌రో ఘోర‌మైన ఘ‌ట‌న జ‌రిగింది. ఈ రోజుల్లో ఎవ‌రిని న‌మ్మాలో ఎవ‌రిని న‌మ్మ‌కూడ‌దో కూడా అర్ధం కావ‌డం లేదు. ఇలాంటి ద‌య‌నీయ‌మైన ప‌రిస్థితుల్లో క‌ట్టుకున్న భ‌ర్త‌, క‌న్న తండ్రి తోడ‌బుట్టిన అన్న ఇలా ఎవ‌ర్నీ న‌మ్మ‌డానికి లేదు అన్న‌ట్లు ఉంది ప్ర‌స్తుత స‌మాజం. బంధాలు, అనుబంధాలు క‌నీస మాన‌వ‌తా విలువ‌లు కూడా లేకుండా విచ‌క్ష‌ణా ర‌హితంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు ఈ మాన‌వ మృగాలు.  కట్టుకున్న భర్తే భార్య కాళ్లు, చేతులు కట్టేసి స్నేహితులతో కలిసి గ్యాంగ్‌రేప్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. స్నేహితులతో వచ్చి విచక్షణా రహితంగా పశువుల్లా పడి అత్యాచారం చేశారని బాధితురాలు వాపోయింది. సొంత భర్తే ఘాతుకానికి పాల్పడడంతో బాధిత మహిళ కుంగిపోయింది. బయటకు చెప్పుకోలేక కన్నీరుమున్నీరైంది.

 

కట్టుకున్న భర్త పశువులాగా త‌న  స్నేహితులతో కలిసి భార్య అన్న విష‌యాన్ని కూడా మ‌రిచి ఆమెను గ్యాంగ్‌రేప్ చేసిన‌ దారుణ ఘటన అనంతపురంలో జరిగింది. కదిరికి చెందిన మల్లేష్ ఫుల్లుగా మద్యం తాగి స్నేహితులతో కలసి ఇంటికి వచ్చాడు. తన అర్ధాంగి అని కూడా చూడకుండా కాళ్లు, చేతులు కట్టేసి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. మల్లేష్, అతని స్నేహితులు పశువుల్లా పైన పడి తమ పశువాంఛ తీర్చుకున్నారు. ప్రతిఘటించినందుకు బాధితురాలి శరీరాన్ని గోళ్లతో చీల్చి దారుణంగా రేప్ చేశారు. రక్తగాయాలైన మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

 

కట్టుకున్న భర్తే ఘాతుకానికి పాల్పడడంతో ఆ భార్య గుండెపగిలింది. ఎవరికీ చెప్పుకోలేక బాధితురాలు మౌనంగా రోధించింది. చివరకు అంగన్‌వాడీ సిబ్బంది సాయంతో ధైర్యం తెచ్చుకుని తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు భర్త మల్లేష్‌పై రేప్ కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇలాంటి ఘ‌ట‌న‌లు అస్స‌లు రోజురోజుకి పెర‌గ‌డం త‌ప్పించి త‌గ్గ‌డం లేదు. దీని పైన త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటేనే కానీ లాభం లేదు అని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: