బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అనంత్‌కుమార్‌ హెగ్డే మహారాష్ట్రలో ‘రూ. 40 వేల కోట్ల నిధులను కాపాడేందుకే  హుటాహుటిన ఫడ్నవీస్‌ను సీఎం చేశాం’ అంటూ  చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలను ఫడ్నవీస్‌  తీవ్రంగా ఖండిస్తున్నారు.  హెగ్డే వ్యాఖ్యల్లో వాస్తవం ఉంటే ధాని నరేంద్రమోదీ తక్షణమే రాజీనామా చేయాలని ఎన్సీపీ, ఇది మహారాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయడమేనని శివసేన మండిపడ్డాయి.  శనివారం అనంత్‌ కుమార్‌ కర్ణాటక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. హెగ్డే పై వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీకి మెజారిటీ లేకపోయినా, మహారాష్ట్రలో ఫడ్నవీస్‌ను ఎందుకు సీఎం చేశారన్న ప్రశ్న చాలా మంది అడుగుతున్నారు. 

 

ఫడ్నవీస్‌ను మహారాష్ట్రలో సీఎం నియంత్రణలో రూ. 40 వేల కోట్లు ఉన్నాయి. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ నిధులు దుర్వినియోగమవుతాయి. ఆ నిధులను కాపాడటం కోసమే హుటాహుటిన సీఎం చేశాం.. వాటిని అభివృద్ధి పనులకు కేటాయించడం కోసమే ఆ డ్రామా ఆడాం. ఫడ్నవీస్‌ సీఎం అయిన 15 గంటల్లోనే ఆ నిధులను ఎక్కడికి పంపాలో అక్కడికి పంపి, వాటిని కాపాడారు. ఆ నిధులను కేంద్రానికి తిరిగి పంపించనట్లయితే.. హెగ్డే అవి శివసేన కూటమి సీఎం చేతిలో పడితే ఏం జరుగుతుందో మీకు తెలుసు’ అంటూ  సంచలన వ్యాఖ్యలు చేశారు.  

 


నవంబర్‌ 23న ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్‌ పవార్‌ మద్దతుతో ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రి కావడం, ఆ తరువాత మెజారిటీ నిరూపించుకోలేని పరిస్థితుల్లో 80 గంటల్లోపే రాజీనామా చేయడం తెలిసిందే.మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ హెగ్డే వ్యాఖ్యలను  అబద్ధాలంటూ ఖండించారు. సోమవారం తాను సీఎంగా ఉన్న ఆ మూడు రోజుల్లో ఎలాంటి నిధుల గురించి  కేంద్రం అడగలేదని, తాము కూడా కేంద్రానికి నిధులను పంపించలేదని  స్పష్టం చేశారు. 


‘బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ కంపెనీ చేపట్టింది. వారికి భూ సేకరణ కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. కేంద్రం మమ్మల్ని నిధులు అడగలేదు. మేం పంపించలేదు. ఏ ప్రాజెక్టు నుంచి కూడా మహారాష్ట్రకు చెందిన ఒక్క రూపాయిని కూడా కేంద్రానికి పంపించలేదు’ అని  వివరణ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: