పై ఫొటోలో ఉన్న జంటను చూసారా? మీకేమైనా కొత్తగా కనిపిస్తుందా? కనిపించపోతే..మరొక సారి చూడండి.. ఇప్పుడు అసలు విషయానికి వస్తే...ఆ ఫొటోలో ఉన్న ఇద్దరు మనసులు.. పరిచయమైనా కొద్ది రోజుల్లోనే పాలు నీళ్లలా బాగా కలిసిపోయాయి.. దాంతో వారిద్దరూ చాలా అంటే చాలా ఘాడంగా ప్రేమించుకున్నారు.. పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఎప్పటి రొటీన్ లవ్ స్టోరీ లాగానే వారి ప్రేమ పెళ్ళి దగ్గరకు వచ్చి ఆగిపోయింది.. చివరికి వారి ప్రేమ పంచాయితీ పోలీసులు చెంతకు చేరింది. అయితే ఈ కథలో బిగ్ ట్విస్ట్ ఏంటంటే... వారిద్దరూ అబ్బాయిలే..అవును మీరు చదివింది కరెక్టే.




అయితే ఎడమ వైపు ఉన్న అబ్బాయి కుడి వైపు ఉన్న అబ్బాయిని 'నువ్వు లింగ మార్పిడి చేసుకుంటూనే నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను' అని షరతు పెట్టాడు. దాంతో.. 'ఓస్, అంతేనా...అనుకుంటూ' అతనిమీద ప్రేమతో ఆ అబ్బాయి లింగ మార్పిడి చేసుకొని అమ్మాయిగా మారింది. ప్రియుడి వద్దకు వెళ్లి తన అందమైన అమ్మాయి రూపాన్ని చూపించాలని.. చక్కగా రెడీ అయ్యింది. ఆ తరువాత... అబ్బాయి ఇంటికి చకచకా వెళ్ళింది.. కానీ చివరి నిమిషంలో అబ్బాయి... ఆశతో వచ్చిన అమ్మాయిని నట్టేట ముంచేశాడు.. అంటే పెళ్ళికి నిరాకరించాడు.. తనని వద్దంటే వద్దని మొండికేసాడు. దాంతో ఏం చేయాలో దిక్కుతోచని అమ్మాయి.. పోలీసులను ఆశ్రయించింది.


ఇక వారి.. ఐడెంటిటీ విషయానికొస్తే... సూర్యాపేట జిల్లా ఇమాంపేటకు చెందిన మునగాల జానయ్య అనే వ్యక్తి.. అదే సూర్యాపేట జిల్లాకు చెందిన గుండ్లగాని సాయితో పరిచయం పెంచుకొని.. ప్రేమించి.. ఆపై పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. అయితే సాయి... జనయ్యాను లింగ మార్పిడి చేసుకొని అమ్మాయిలాగా మరమన్నాడు. జానయ్య అమ్మాయిలా మారాడు. కానీ మహిళగా మారిన తర్వాత సాయి వివాహానికి నో చెప్పాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ పంచాయితీని ఎలా విప్పాలో తెలియక పోలీసులు తలల పట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: