పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ తరపున తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అలానే ఆయన పార్టీకి కూడా కేవలం ఒకే ఒక ఎమ్యెల్యే సీటు రావడంతో ఇకపై పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో కొన్నాళ్ల నుండి ప్రజలతో ఎక్కువగా మమేకం అవుతున్నారు. ఇక గత ఏడాది అజ్ఞాతవాసి సినిమాతో తన సినీ లైఫ్ కి గుడ్ బై చెప్పిన పవన్, ఇటీవల తన ఫ్యాన్స్ కోరిక మేరకు మనసు మార్చుకుని అతి త్వరలో ఒక సినిమాలో హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. ఇక కొద్దిరోజులుగా పలు కార్యక్రమాలతో ఆంద్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్, నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా తెలుగు హీరోలపై విరుచుకుపడ్డారు. 

 

మన కన్నతల్లి వంటి మాతృ భాషను పలువురు ప్రజలతో పాటు కొందరు సినిమా నటులు సైతం మరిచిపోతున్నారని, అవకాశం ఉన్నంతవరకు తాను ఎక్కువగా తెలుగులోనే మాట్లాడుతానని, అలానే మన భాషకు మనమే విలువనివ్వకపోతే పరాయి రాష్ట్రాల వాళ్ళు ఇంకేం ఇస్తారు చెప్పండి అంటూ వ్యాఖ్యానించారు. ఇక అంతటితో ఆగని పవన్, ప్రస్తుతం టాలీవుడ్ లోని కొందరు హీరోలకు తెలుగు భాషను రాయడం కానీ, చదవడం కానీ రాదని వ్యాఖ్యానించారు. కాగా ఆయన చేసిన ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో కొంత దుమారాన్ని చెలరేగేలా చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆ వ్యాఖ్యలు ఒకరకంగా ఇండైరెక్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబుని టార్గెట్ చేసినవేనని పలువురు అభిప్రాయపడుతూ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. 

 

నిజానికి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించినట్లుగా తెలుగు భాషను రాయడం కానీ చదవం కానీ రానివారిలో మహేష్ బాబు గారు కూడా ఉంటారని, అంతేకాక ఆయనే స్వయంగా తనకు అవి రెండూ రావని పలుమార్లు చెప్పడం కూడా జరిగిందని, దానిని బట్టి పవన్ గారు కావాలనే మహేష్ ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు విమర్శిస్తున్నారు. అయితే దీనిపై కొందరు పవన్ ఫ్యాన్స్ స్పందిస్తూ, పవన్ కళ్యాణ్ గారు కేవలం మహేష్ బాబుని ఉద్దేశించి ఎక్కడా కూడా వ్యాఖ్యానించలేదని, కొందరు కావాలనే ఆయనపై బురద చల్లుతున్నారని అంటున్నారు. కాగా ఈ మ్యాటర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: