వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఎప్పుడు ట్విట్టర్ లో ప్రతిపక్ష నేతలపై సెటైర్లు వేస్తూనే ఉంటారు. అనవసరంగా ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసే ప్రతిపక్ష పార్టీలకు చంప చెల్లుమనే సమాధానం ఇస్తుంటాడు విజయసాయి రెడ్డి. ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి నిన్న మొన్నటి వరుకు చంద్రబాబు, నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చెయ్యగా.. 

             

ఇప్పుడు చంద్రబాబు దత్త పుత్రుడు అయిన పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు విజయసాయి రెడ్డి. ఇంకా ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉస్కో అంటేనే కాసేపు మొరుగుతాడు అని ట్విట్టర్ వేధికగా సంచలన వ్యాఖ్యలు చేశాడు విజయసాయి రెడ్డి. దీంతో ఈ వ్యాఖ్యలకు నెటిజన్లు కూడా వత్తాసు పలుకుతున్నారు. 

              

విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ ''ఎలక్షన్లలో ప్రజలు పొర్లించి కొట్టినంత పనిచేసినా సిగ్గుపడకుండా దులిపేసుకున్నాడు. యాక్టరును చూద్దామని నలుగురు పోగవగానే రెచ్చిపోయి డైలాగులు వదుల్తున్నాడు. రాజకీయాలంటే ప్యాకేజి కోసం అమ్ముడు పోవడం కాదు. ఎవరో ఉస్కో అంటే కాసేపు మొరిగి వెళ్లిపోవడం అంతకంటే కాదు.'' అంటూ సంచలన ట్విట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

                 

మరింత సమాచారం తెలుసుకోండి: