నేటి కాలపు జీవన విధానంలోనే పలు లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీరి చూపుల నుండి, నడవడిక మొదలు ఆలోచనా విధానం వరకు ప్రతిదాంట్లోనూ విభిన్నతలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వారికి సమాజం, చట్టం, సామాజిక, మానసిక బంధాల పట్ల  ఏమాత్రం గౌరవం ఉండటం లేదు. వీరి ఆలోచనాతీరే వికృతంగా ఉంది. ఇలాంటి వారు సమాజంలో కొనసాగిస్తున్న మారణకాండ చాలా దారుణంగా ఉంటుంది.

 

 

దీనికి నిదర్శణంగా అతికిరాతకంగా తల్లీబిడ్డను చంపేసి తగులబెట్టిన దారుణ ఘటన ఏపీలో జరిగింది. రెండేళ్ల బాలుడితో సహా తల్లిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసి తగులబెట్టారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. వివరాలు పరిశీలిస్తే రెండేళ్ల చిన్నారితో సహా మహిళను అత్యంత దారుణంగా చంపేసి తగులబెట్టేశారు. ఈ ఘటన సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట గ్రామ సమీపంలో జరిగింది.. అక్కడ పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న రెండు మృతదేహాలను గుర్తించారు.  

 

 

ఎక్కడో చంపి ఇక్కడకి తీసుకువచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుగా అనుమానిస్తున్నారు. రెండేళ్ల చిన్నారిని సైతం కాల్చివేయడం చూపరులను తీవ్రంగా కలసివేసింది.. ఇకపోతే అటుగా వెళ్లిన స్థానికులు అక్కద పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలను చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో  వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

 

ఇక చిన్నారితో సహా చంపేసి తగులబెట్టడంతో పలు అనుమానాలు తావిస్తున్న ఈ ఘటనపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తూ చేస్తున్నారు. హత్యకు గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు. ఇక ఈ మద్యకాలంలో దారుణంగా హత్య చేసిన అనంతరం మృతులను తగులబెడుతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఆధారాలు దొరక్కుండా తప్పించుకునేందుకే పెట్రోల్ పోసి నిప్పంటిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైన ఇలాంటి దుశ్చర్యలతో ఇప్పుడు లోకం అల్లాడి పోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: