దేశాన్ని కుదిపేస్తున్న దిశ హత్యాచార ఉదంతంలో భయంకర వాస్తవాలు వెల్లడవుతున్నాయి. ఆమెను అమానుషంగా అత్యాచారం చేసిన తీరు ఇప్పటి వరకూ వెలుగు చూసింది. అత్యాచారం చేసిన తర్వాత చంపేసి.. దుప్పట్లో చుట్టి..లారీలో వేసుకుని.. వెళ్లి పెట్రోల్ పోసి కాల్చేశారని ఇప్పటి వరకూ ఉన్న సమాచారం. కానీ ఇప్పుడు మరో భయంకర వాస్తవం బయటకు వచ్చింది.

 

అత్యాచారం చేసిన తర్వాత ఆమెను బతికి ఉండగానే పెట్రోల్ పోసి కాల్చేశారట. ఈ విషయాన్ని దిశ హంతకులే చెబుతున్నారు. దిశ బతికుండగానే సజీవదహనం చేసినట్లు కీలక నిందితుడు ఆరిఫ్‌ చర్లపల్లి జైల్లోని కొందరు కిందిస్థాయి సిబ్బందికి చెప్పిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులోని నలుగురు నిందితులను హైదరాబాద్‌ చర్లపల్లి జైలులో ప్రత్యేక నిఘాలో ఉంచిన సంగతి తెలిసిందే. ఆ నిందితులతో కొంతమంది జవాన్లు మాట కలిపినపుడు ఆరిఫ్‌ జంకుగొంకు లేకుండా పలు విషయాలు బయటపెట్టాడట.

 

నేరం జరిగిన రోజున ఆరిఫ్‌ తో పాటు ముగ్గురు నిందితులు దిశను బలవంతంగా చేతులు, కాళ్లు పట్టుకుని సమీప ప్రాంతానికి లాక్కుని వెళ్తుంటే రక్షించడంటూ ఆమె పెద్దగా కేకలు వేసిందట. అవి ఎవరికైనా వినిపిస్తాయనే భయంతో అప్పటికే తాగిన మత్తులో ఉన్న చెన్నకేశవులు వెంటనే జేబులోని సీసా తీసి అందులోని మద్యాన్ని బలవంతంగా ఆమె నోట్లో పోశాడట. అప్పటికే భయంతో ఆందోళనతో ఉన్న ఆమె స్పృహ కోల్పోయిందట.

 

ఆ తరవాత నలుగురు నిందితులు దిశపై అత్యాచారానికి ఒడిగట్టారట. తరువాత ఆమెను లారీ మీదకు ఎక్కించి.. అక్కడ కూడా దారుణంగా అత్యాచారం చేశారట. మద్యం తాగిస్తూ.. వరుసగా అత్యాచారం చేసిన ఫలితంగా ఆమె పూర్తిగా స్పృహ కోల్పోయిందట. దీంతో ఆమె చనిపోయిందనుకుని చటాన్‌పల్లి వంతెన దగ్గరకు తీసుకువెళ్లి బతికి ఉండగానే పెట్రోల్‌ పోసి తగలబెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: