తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ కు ఏ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారో చెప్పక్కర్లేదు. ప్రభాస్ కు ఫాలోయింగ్ ఎక్కువ. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ భారత దేశంలో ప్రభాస్ కు ఫ్యాన్స్ అధికంగా ఉన్నారు. బాహుబలి తరువాత ప్రభాస్ వెయిట్ పెరిగింది. అయన సినిమాలు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను కొల్లగొడుతున్నాయి. బాహుబలి ఇచ్చిన కిక్ తో సాహో సినిమా క్లిక్ కాకపోయినా... ఆ సినిమా భారీ వసూళ్లు సాధించింది.
ఒక్క బాలీవుడ్ లోనే రూ. 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి అదరగొట్టింది. ఇక ఇదిలా ఉంటె, బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రభాస్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నది. ఎలాగైనా బాలీవుడ్ ప్రభాస్ ను స్ట్రెయిట్ మూవీని చేయించాలని చూస్తున్నారు. కానీ, అది నిజం అవుతుందో కాదో తెలియదు.
బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ, ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా ఈ విషయంలో ప్రభాస్ తో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.
ఆదిత్య చోప్రా నిర్మాణంలో వచ్చిన ధూమ్ సీరీస్ గురించి అందరికి తెలిసిందే. ఇందులో మూడు సీరీస్ లు వచ్చాయి. అభిషేక్ బచ్చన్ హీరో. అయన పోలీస్ అధికారి. అయితే, ఈ సీరీస్ లలో విలన్ పాత్రలకు ఉండే క్రేజ్ అలాంటిది ఇలాంటిది కాదు. ముఖ్యంగా చెప్పాలి అంటే విలన్ నే సినిమాకు హీరో అని చెప్పొచ్చు. ధూమ్ మొదటి సినిమాలో జాన్ అబ్రహం, రెండో భాగంలో హృతిక్ రోషన్, మూడో భాగంలో అమీర్ ఖాన్ విలన్ పాత్రలు చేశారు.
ఇప్పుడు నాలుగో భాగాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో విలన్ పాత్ర కోసం ప్రభాస్ ను తీసుకుంటున్నారట. ప్రభాస్ కూడా ఇందులో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం. ధూమ్ సీరీస్ లో అవకాశం వస్తే ఎవరైనా సరే ఎందుకు వదులుకుంటారు చెప్పండి. ఒక్కసారి ఇలాంటి సినిమాల్లో నటిస్తే.. ఆ సినిమా ప్రపంచస్థాయిలో హిట్ కావడం ఖాయం. ప్రస్తుతం ప్రభాస్ జాన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతున్నది.