దిశపై అత్యాచారం, హత్య కేసులు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఈ కేసులో నిందితులను ఇప్పటికే పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి విలువైన సమాచారం రాబట్టినా ఇంకా రావలసిన నిజాలు చాలా ఉన్నాయి. అయితే, వాటిని మాత్రం నిందితులు బయట పెట్టడం లేదు. ఇప్పటి వరకు అనుకున్నది ఒకటైతే.. అసలు విషయం అది కాదని తేలిపోయింది. మద్యం మత్తులో ఆమెను ఎత్తుకెళ్ళి రేప్ చేసి చంపి ఆపై పెట్రోల్, డీజిల్ పోసి తగలబెట్టారు అన్నది ఇప్పటి వరకు బయటకు వచ్చిన నిజం.
కానీ, అసలు విషయం అది కాదని, దిశను బతికుండగానే చంపేసినట్టుగా నిందితులు చెప్పినట్టు తెలుస్తోంది జైలులో ఉన్న నలుగురు నిందితులు అక్కడ ఉండే కొంతమంది పోలీసులకు ఈ విషయం చెప్పినట్టుగా సమాచారం. మత్తులో ఉన్న నలుగురు ఆమె కాళ్ళు చేతులు పట్టుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లే సమయంలో హెల్ప్ హెల్ప్ అని పెద్దగా కేకలు వేసిందట.
అయితే, అప్పటికే మద్యం తాగున్న ఏ 4 నిందితుడు చెన్నకేశవులు జేబులో ఉన్న మద్యం బాటిల్ తీసి ఆమె నోట్లో పోశారట. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. అక్కడి నుంచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆ తరువాత ఆమెను ప్యాంటు లేకుండానే లారీ క్యాబిన్ లో ఎక్కించారు. అక్కడ కూడా అత్యాచారం చేశారు.
అత్యాచారం చేస్తూ మరలా మద్యం తగ్గించడంతో ఆమె పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిందట. అక్కడి నుంచి దిశ చటాన్ పల్లి అండర్ పాస్ వద్దకు తీసుకెళ్లి కాల్చేశారట. ఈ విషయాన్ని నిందితులు కొంతమంది పోలీసుల వద్ద పేర్కొన్నట్టు తెలుస్తోంది. వీరిని మిగతా ఖైదీలకు దూరంగా హైసెక్యూరిటీ జైల్లో ఉంచారు. ఇందులో కిడ్నీసమస్యతో బాధపడుతున్న చిన్న కేశవులకు వైద్యం అందిస్తున్నారు. అలానే దోమకాటు వలన ఆరిఫ్ జ్వరంతో ఉన్నాడని జైలు సిబ్బంది చెప్తున్నారు.