వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేసే  వారిపై ఘాటుగా కౌంటర్ ఇస్తుంటాడు  వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయి రెడ్డి. మరోమారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర  ఆరోపణలు చేశారు. వాన పడుతుంటే, ఎండ కాస్తుంటే  ఎవరైనా గొడుగు పట్టుకుని బయటకు వెళ్తుంటారు...  కానీ పవన్ కళ్యాణ్ మాత్రం శీతాకాలంలో కూడా గొడుగు పట్టుకుని బయటకు వెళ్తున్నారు అని ఎద్దేవా చేసారు వైసిపి పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి. శీతాకాలంలో గొడుగుతో తిరుగుతూ గంటగంటకు చిత్త బ్రమాలకు  లోనవ్వుతూ  ఉంటాడు అంటూ పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేశారు. ఇక మాట్లాడడం మొదలుపెడితే ఏ సమయంలో ఏ డైలాగ్ వదులుతాడో  ఆయనకి అంతు  పట్టదు అంటూ విజయసాయి రెడ్డి అన్నారు. బీజేపీలో జనసేన విలీనం కి పూర్తిగా అంతా ప్రిపేర్ అయిపోయాడని విజయ్ సాయి రెడ్డి ఆరోపించారు. 

 

 

 

 ఒక ఆయనేమో 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడని  అని ఇంకొక ఆయనేమో అజ్ఞానాంధకారాన్ని కవర్ చేసుకునేందుకు రాజ్యాంగాన్నే ఔపాసన పట్టాను  అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని పరోక్షంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో కొనసాగాలంటే ఇంత నీచత్వానికి పాల్పడలా అంటూ ప్రజలు అసహ్యించుకునే లెవెల్ కి ఇద్దరు ఎదిగిపోయారు అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రేపిస్టులకు ఉరిశిక్ష ఎలా వేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు అంటే... ఆయన మానసిక స్థితిలో  ఏదో పెద్ద ప్రాబ్లం ఉన్నటు ఉంది అంటూ  పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి విమర్శించారు. 

 

 

 

 దేశం మొత్తం దిశగా ఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే... ఈయనకు మాత్రం రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమై పోయింది అంటూ ఆరోపించారు. పవనిజం అంటే ఇదేనేమో మరి... రాజకీయ పార్టీ పెట్టింది అందుకేనేమో మరి అంటూ పవన్ కళ్యాణ్ తీరును తప్పు పట్టారు వైసిపి పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి. అయితే అటు పవన్ కళ్యాణ్ కూడా గత కొన్ని రోజులుగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువగా జగన్ సర్కార్ పై విరుచుకుపడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: