ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈయ‌న టాలీవుడ్‌లో ఒక హీరోనే కాదు. మెగాబ్ర‌ద‌ర్‌,  రాజ‌కీయ నాయ‌కుడు కూడా. జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ మ‌రోసారి ఘాటుగా వ్యాఖ్యానించారు. సినీ, రాజ‌కీ విశ్లేష‌కుడు క‌త్తి మహేష్‌. ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేస్తూ రాజకీయ వర్గాల్లో వేడిపుట్టిస్తున్నారు. ఆయ‌న ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టానంటూ ఉంటారు. అయితే ప్ర‌స్తుతం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న పై ప‌వ‌న్ కామెంట్స్ హాట్ టాప్‌క్ అయిపోయాయి.  దిశ ఘటనతో ముడిపెడుతూ జగన్ పాలనను ప్రశ్నించడంపై సోషల్ మీడియాలో ప‌వ‌న్ ను నెటిజ‌న్ల ఆడేసుకుంటున్నారు.

ఈ సందర్భంలో ‘ఆడపిల్లల పై అఘాయిత్యాలకు మాతృభాష నిర్లక్ష్యమే కారణం’ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని తప్పు పడుతూ నిప్పులు చెరిగారు కత్తి మహేష్. ‘మాతృభాషకి దిశ రేప్‌కి లింకేందిరా నాయనా.. వామ్మో... వాయ్యో! ఈ సోదిగాడికి పిచ్చి పట్టిందిరో’ అంటూ ఫేస్ బుక్‌లో పవన్‌ను ఏకిపారేస్తూ వరుస పోస్ట్‌లు వదలాడు.

"క్రిస్టియానిటీని పాటిస్తే, కులం ప్రస్తావన ఉండదు" అని పవన్ కళ్యాణ్ అంటున్నారని..  ఈ దేశంలో ఎవరు ఏమతాన్ని నమ్మినా, అందరూ నిజంగా నమ్మేది కులమేరా సోదినాయాలా’ అంటూ పవన్‌కు ఘాటైన కౌంటర్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్‌తో అంటకాగి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా నాశనమైపోయిన వాళ్ళు.. వామపక్షాలు, బహుజన్ సమాజ్ పార్టీ, జేడీ లక్ష్మీనారాయణ, జయప్రకాష్ నారాయణ్, చంద్రబాబు నాయుడు. ఎదో జగన్‌కి చెడ్డపేరు వస్తుందని రాయలసీమలో సైలెంట్‌గా ఉన్నారుగానీ... సోదినాయాలు వాగుతున్నవాగుడికి ఎవడో ఒకడు ఈపాటికి కొట్టుండేవాడు. పరిఢవిల్లుతాయి. పరిణమిల్లుతాయికి తేడా చెప్పరా సోదినాయాలా.. తరువాత 'ఆముక్తమాల్యద' గురించి మాట్లాడుకుందాం’ అంటూ పవన్ వ్యాఖ్యలపై ఫైర్ అవుతూ వివాదాస్పద కామెంట్స్ చేశారు.

గ‌తంలో కూడా ఆయ‌న పార్టీని విలీనం చేసే విష‌యంలో మాట్లాడుతూ... నిజమే... విలీనం చేస్తే వన్ టైం సెటిల్మెంట్ అయిపోతుంది. ఇలాగే ఉంటే అవసరానికి తగ్గట్టు ప్యాకేజీలు వస్తూనే ఉంటాయి అని పోస్ట్ చేసాడు. పవన్ ఫ్యాన్స్ కూడా దీనిపై మండిపడ్డారు. మొత్తానికి ఏదేమైనా కత్తి మహేష్ ఇలా మాటిమాటికి పవన్‌ను టార్గెట్ చేయడం మాత్రం ఇంకా మానడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: