ఓ వైపు మహిళలకు రక్షణ లేకుండా పోతుంది..అత్యాచారాలు, హత్యలతు భీతిల్లిపోతున్నారు. పోలీసులు ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటున్నా ప్రతిరోజూ కామాంధులు ఎక్కడో అక్కడ రెచ్చిపోతూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ దేశాన్ని మొత్తం ఒక్కసారే ఉలిక్కిపడేలా చేసిన వెటర్నరీ డాక్టర్ దిశ కేసు మరువక ముందు వరుసగా అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి నేరస్థులకు బహిరంగంగా శిక్షలు విధిస్తే సమాజం లో కాస్తైనా మార్పు వస్తుందని మహిళా సంఘాలు గగ్గోలు పెడుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు దిశకు జరిగిన అన్యాయంపై గళమెత్తుతున్నారు. మరీ దారుణమైన విషయం ఏంటేంటే.. దిశ సంఘటనపై పిచ్చికుక్కల్లా కొంత మంది అసభ్యకరమైన ట్రోలింగ్, ఫోర్స్ సైట్లలో వీడియో గురించి వెతకడం వంటివి చేస్తున్నారు. దీనిపై అలర్ట్ అయిన పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పపడేవారిని వెంటనే అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్ కి చెందిన శ్రీరామ్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.
రోజు రోజుకీ మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడటం..మాట వినకపోతే హింసించడం.. తమ గుట్టు ఎక్కడ బయట పడుతుందో అని ఏకంగా హత్యలు చేయడం లాంటి దారుణమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ కామాంధుడు యువతులు స్నానం చేస్తుండగా దొంగచాటుగా వీడియో తీయడం.. అది కాస్త ఆ యువతి గమనించి పోలీసులను ఆశ్రయించడంతో గుట్టు రట్టయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కొందరు యువతులు రూమ్ అద్దెకు తీసుకొని బంజారాహిల్స్లో ఉంటున్నారు.
వారి పక్కనే యూసూఫ్ ఫరక్ అనే వ్యక్తి కుటుంబం నివాసం ఉంటున్నారు. అయితే ఓ యువతి స్నానం చేస్తుండగా కిటికీలో నుంచి ఫరూక్ వీడియో తీశాడు. అది గమనించిన యువతి 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఫరూక్ నుంచి సెల్ ఫోన్ వద్ద ఫోన్ను స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.