పేద, మధ్యతరగతి, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇలా అందరు హయిగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఏపీ సీయం జగన్ ఎన్నో పధకాలు అమలు చేస్తున్నారు. మరెన్నో మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లుతున్నారు. ఇప్పటికే నిరుద్యోగులు, రైతులు, డ్రైవర్స్, లాయర్స్, పోలీస్ ఇలా అనేక విభాగాల్లో పని చేసే వారికి ఎన్నో స్కీంలు పెట్టారు కూడా. ఇదే కాకుండా ఇప్పటికే పోలీసులకు వీక్లీ ఆఫ్లు ఇచ్చిన జగన్ సర్కారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, పోలీసు కుటుంబాలకు మరింత ధీమానిచ్చేలా నిర్ణయం తీసుకున్నారు..
అదేమంటే రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న పోలీసు సంక్షేమ నిధి నుంచి నిర్వహిస్తున్న గ్రూపు ఇన్సూరెన్స్ విలువను భారీగా పెంచారు. ఇకపోతే దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు పోలీసుల గ్రూప్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని పెంచడం గమనార్హం. దీని వల్ల ఇప్పటి వరకు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సైలకు దాదాపు రూ.13 లక్షల ఇన్సూరెన్స్గా చెల్లిస్తున్నారు. దీన్ని రూ.20 లక్షలకు పెంచారు. ఇక ఇదివరకే పోలీసు కుటుంబాలకు బీమా భద్రతను కలిపిస్తూ, కొద్ది రోజుల క్రితమే పోలీసు సిబ్బంది ఎవరైనా అసహజ మరణం పొందితే రూ. 30 లక్షలు, ఉగ్రవాదుల దాడి కారణంగా ప్రాణాలు కోల్పోతే రూ.40 లక్షలను అందించాలని నిర్ణయించారు.
ఈ ఈ పాలసీ విధానం పదవీ విరమణ పొందిన తర్వాత కూడా అమలు కానున్నాయి. ఇక ఈ పెరిగిన విధానాన్ని పరిశీలిస్తే ఎస్సై, ఇన్స్పెక్టర్లకు రూ.35 లక్షలు, డీఎస్పీ, ఆపై స్థాయి అధికారులకు రూ. 45 లక్షలను గ్రూప్ ఇన్సూరెన్స్ కింద చెల్లించనున్నారు. క్యాంపు ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమం లో సీఎం సమక్షంలో ప్రభుత్వం, పోలీసు శాఖల తరఫున యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి రూ. 4.74 కోట్లను చెల్లించారు. ఈ గ్రూపు ఇన్సూరెన్స్తో పాటు ప్రమాదవశాత్తూ పోలీసులకు ఏదైనా జరిగితే చెల్లించే బీమాను గణనీయంగా పెంచారు. ఇక ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.